కార్డన్సెర్చ్లో నలుగురు పాత నేరస్తులు సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: మేడిపల్లి ఇందిరానగర్లో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేనటువంటి 36 బైక్లు, 3 ఆటోలు, 7 సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు పాత నేరస్తులు సహా ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.