
సినీనటుడి కిడ్నాప్ కేసులో పురోగతి
సినీ నటుడు కాలె శ్రీనివాసరావు కిడ్నాప్ కేసులో నగర పోలీసులు మంగళవారం పురోగతి సాధించారు.
హైదరాబాద్: సినీ నటుడు కాలె శ్రీనివాసరావు కిడ్నాప్ కేసులో నగర పోలీసులు మంగళవారం పురోగతి సాధించారు. గత నెల 31వ తేదీన శ్రీనివాసరావును కిడ్నాప్ చేసిన అగంతకులు... రూ. 2 లక్షలు చెల్లిస్తే వదిలేస్తామని అతడి కుటుంబ సభ్యులను ఫోన్లో బెదిరించారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేసి.... కిడ్నాప్ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్న జలీల్, స్టూడియో9 ఛానెల్లో రిపోర్టర్గా పని చేస్తున్న జగదీశ్వర్ కిడ్నాపర్లుగా సెల్ ఫోన్ల ద్వారా పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి సహకరించిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.