టీడీపీని ఖాళీ చేయడమే టీఆర్‌ఎస్ లక్ష్యం | Peddireddy fires on TRS | Sakshi
Sakshi News home page

టీడీపీని ఖాళీ చేయడమే టీఆర్‌ఎస్ లక్ష్యం

Feb 27 2016 3:26 AM | Updated on Aug 10 2018 8:16 PM

టీడీపీని ఖాళీ చేయడమే టీఆర్‌ఎస్ లక్ష్యం - Sakshi

టీడీపీని ఖాళీ చేయడమే టీఆర్‌ఎస్ లక్ష్యం

రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేయటమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పనిచేస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి ఇనుగాల పెద్దిరెడ్డి విమర్శించారు.

టీడీపీ అధికార ప్రతినిధి ఇనుగాల పెద్దిరెడ్డి

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేయటమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పనిచేస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి ఇనుగాల పెద్దిరెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శుక్రవారం మాట్లాడుతూ ఎర్రబెల్లి వ్యాఖ్యలతో టీఆర్‌ఎస్ కుట్రపూరిత వైఖరి బయటపడిందన్నారు. తెరాస ప్రత్యర్థి పార్టీల నేతలను ఒత్తిళ్లకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటోందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌లో ఎర్రబెల్లి చేరికపై మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారానంటున్న ఎర్రబెల్లి పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు పార్టీ మారలేదని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement