అసెంబ్లీ జరుగుతున్న తీరును ఖండిస్తున్నాం | payam venkateshwarlu fire | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ జరుగుతున్న తీరును ఖండిస్తున్నాం

Mar 14 2016 1:28 AM | Updated on May 29 2018 4:26 PM

అసెంబ్లీ జరుగుతున్న తీరును ఖండిస్తున్నాం - Sakshi

అసెంబ్లీ జరుగుతున్న తీరును ఖండిస్తున్నాం

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. సభలో ప్రజా సమస్యలపై చర్చ లేకుండా పూర్తిగా అధికారపక్షం సొంత డబ్బా కొట్టుకుంటోంది.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. సభలో ప్రజా సమస్యలపై చర్చ లేకుండా పూర్తిగా అధికారపక్షం సొంత డబ్బా కొట్టుకుంటోంది. ప్రశ్నోత్తరాలను కూడా అధికార పక్షం, వారి మిత్రపక్షం ఎంఐఎం మాత్రమే మాట్లాడుకుని మిగిలిన సభ్యులను విస్మరించారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తున్న వైనాన్ని సభలో చర్చకు రాకుండా అధికారపక్షం బుల్డోజ్ చేస్తోంది. గత బడ్జెట్‌లో ప్రకటించిన రూ.8వేల కోట్లలో యాభై శాతం నిధులను మాత్రమే ఖర్చు చేశారు. సభలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారు.  
 - పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement