ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన | Passengers protest at Shamshabad Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన

Oct 2 2014 9:44 AM | Updated on Apr 7 2019 3:28 PM

నగరంలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ : నగరంలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని ప్రయాణికులు గురువారం ఆందోళనకు దిగారు. గురువారం తెల్లవారుజామున 3.35 నిముషాలకు మస్కట్ విమానం బయలుదేరవలసి ఉంది. ఆ విమానం ఆలస్యంపై 8.30 ని. వరకు ప్రయాణికులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఎయిర్పోర్ట్ అధికారులను సంప్రదించిన వారి నుంచి సరైన సమాధానం అందలేదు. 

ఆగ్రహించిన ప్రయాణికులు వారి బంధువులు ఎయిర్పోర్ట్లో ఆందోళన చేపట్టారు. దీంతో ఎయిర్పోర్ట్లో ఉన్నతాధికారులు దిగి వచ్చారు. మరి కొద్దిసేపట్లో విమానం ఏర్పాటు చేస్తామంటూ ఆందోళన చేస్తున్న ప్రయాణికులకు తెలిపారు. దీంతో ప్రయాణికులు వారి బంధువులు   ఆందోళనలు విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement