2న మహాప్రసాదం పంపిణీ

2న మహాప్రసాదం పంపిణీ - Sakshi


హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి చేతిలో 11రోజుల పాటు పూజలందుకున్న ఆరువేల కిలోల లడ్డూ ప్రసాద పంపిణీ తేదీ పొడిగించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. తొలుత ఈ నెల 30న (బుధవారం) ప్రసాదం పంపిణీ చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు. పంపిణీ సమయంలో బందోబస్తు తప్పనిసరని... పోలీసులు అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్నందున అక్టోబర్-2వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రసాదం పంచిపెడతామని తెలిపారు.



బుధవారం ప్రసాదం పంపిణీ చేయడం లేదని... భక్తులు ఇక్కడికి రావద్దని సూచించారు. లడ్డూను కవర్‌తో పూర్తిగా కప్పి ఉంచడం వల్ల గాలి తగలక పాడైపోయే అవకాశముందని దాత మల్లిబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా భక్తులకు పంచిపెట్టేలా పోలీసులు చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top