కేసీఆర్ గొప్ప రాజనీతిజ్ఞుడు: నాయిని | Nayani Narasimha Reddy praise cm kcr leadership | Sakshi
Sakshi News home page

కేసీఆర్ గొప్ప రాజనీతిజ్ఞుడు: నాయిని

Aug 23 2016 6:42 PM | Updated on Mar 18 2019 9:02 PM

కేసీఆర్ గొప్ప రాజనీతిజ్ఞుడు: నాయిని - Sakshi

కేసీఆర్ గొప్ప రాజనీతిజ్ఞుడు: నాయిని

ప్రాజెక్టులపై మహారాష్ట్రతో తెలంగాణసర్కార్‌ ఒప్పందం చేసుకోవటంతో టీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్‌ ఒప్పందం కుదుర్చుకోవడంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఆనందంలో మునిగితేలారు. తెలంగాణ సెక్రటేరియేట్ సమతా బ్లాక్‌ ముందు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. మహారాష్ట్రతో ఒప్పందం వల్ల తెలంగాణలోని బీడు భూములు సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉందని నాయిని అన్నారు.

గతంలో టీడీపీ, కాంగ్రెస్ విధానాల వల్లే ప్రాజెక్టులు వివాదాస్పదమయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప రాజనీతిజ్ఞుడని ప్రశంసించారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. మహారాష్ట్ర సర్కార్తో చేసుకున్న తాజా ఒప్పందంతో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయని నాయిని వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ నేతలకు భవిష్యత్ లేదని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement