వనస్థలిపురం సాహెబ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో అదృశ్యమైన గురైన చిన్నారుల ఆచూకీ లభ్యమైంది.
హైదరాబాద్ : వనస్థలిపురం సాహెబ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో అదృశ్యమైన గురైన చిన్నారుల ఆచూకీ లభ్యమైంది. చిన్నారులను కిడ్నాప్ చేసిన మహిళ ....వాళ్ల మెడలో గొలుసు, చెవి పోగులు తీసుకుని పాఠశాలకు రెండు కిలోమీటర్ల దూరంలో వదిలి వెళ్లినట్లు సమాచారం. వీరిద్దర్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం ఉదయం స్కూల్కు వెళుతున్న విద్యార్థులను గుర్తు తెలియని మహిళ అపహరించుకు వెళ్లిన విషయం తెలిసిందే. కాగా తమ చిన్నారులు క్షేమంగా తిరిగి రావటంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.