అర్థరాత్రి మంత్రి, మేయర్ తనిఖీలు | minister tummala nageswara rao, mayor bonthu rammohan inspection at kukatpally road works | Sakshi
Sakshi News home page

అర్థరాత్రి మంత్రి, మేయర్ తనిఖీలు

Dec 3 2016 9:28 AM | Updated on Aug 30 2018 4:49 PM

అర్థరాత్రి మంత్రి, మేయర్ తనిఖీలు - Sakshi

అర్థరాత్రి మంత్రి, మేయర్ తనిఖీలు

గ్రేటర్ పరిధిలోని రోడ్డు పనులను మంత్రి తుమ్మల, మేయర్ శుక్రవారం అర్థరాత్రి తనిఖీ చేశారు.

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలో కొనసాగుతున్న రోడ్డు పనులను ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం అర్థరాత్రి స్వయంగా పరిశీలించారు.

కూకట్‌పల్లి వైజంక్షన్ నుంచి మియాపూర్ వరకు వేస్తున్న తారు రోడ్డు పనుల్లో నాణ్యతను వారు తనిఖీలు చేశారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని జాతీయ రహదారి అభివృద్ధికి రూ.28 కోట్లను కేటాయించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement