17 నుంచి బీసీ సంఘాలతో ములాఖత్‌

Maulakat with bc associations from 17th - Sakshi

రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల  

హైదరాబాద్‌: ‘కులాలుగా బలపడదాం.. బీసీలుగా ఏకమవుదాం’అనే నినాదంతో ఈ నెల 17 నుంచి ములాఖత్‌ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ఆదివారం ఇక్కడ జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

బీసీల్లో విద్యాభివృద్ధి, రాజకీయ చైతన్యం, ఓటు విలువ తెలిపేందుకు రాష్ట్రంలో ఉన్న 112 బీసీ కుల సంఘాలతో ఈ ములాఖత్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నుంచి దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సభలు, సమావేశాలను నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రం కోసం తన ప్రాణాలను ధారపోసిన మారోజు వీరన్న స్మారక స్థూపాన్ని పరిరక్షించాలని సీఎం కేసీఆర్‌కు జాజుల విజ్ఞప్తి చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top