కొత్త అసెంబ్లీ, సచివాలయం ఎందుకు? | Marri Shashidhar Reddy comments about Secretariat, Assembly | Sakshi
Sakshi News home page

కొత్త అసెంబ్లీ, సచివాలయం ఎందుకు?

Aug 5 2017 2:53 AM | Updated on Sep 11 2017 11:16 PM

సచివాలయం,అసెంబ్లీ భవనాలు పటిష్టంగా ఉన్నా కొత్త భవనాలు ఎందుకో ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

మర్రి శశిధర్‌రెడ్డి
 
సాక్షి,హైదరాబాద్‌: సచివాలయం,అసెంబ్లీ భవనాలు పటిష్టంగా ఉన్నా కొత్త భవనాలు ఎందుకో ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇప్పుడున్న సచివాలయానికి రాని సీఎం  కేసీఆర్‌కు కొత్త భవనాలు ఎందుకన్నారు. రాష్ట్రమంతా తిరుగుతానని సీఎం అంటుం టే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ప్రాజెక్టుల రీడిజైన్‌పై బహిరంగ చర్చకు రావాలని ఎన్నిసార్లు సవాల్‌ చేసి నా ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిం చారు. ఇలాంటి నిరంకుశ సీఎంపై ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement