వేగంగా వెళ్తున్న లారీ నాలుగేళ్ల చిన్నారిని ఢీకొట్టింది.
ఉప్పల్: వేగంగా వెళ్తున్న లారీ నాలుగేళ్ల చిన్నారిని ఢీకొట్టింది. దీంతో పాప అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన నగరంలోని ఉప్పల్ దేవేందర్ నగర్ కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక కాలనీకి చెందిన చిన్నారి(4) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అటుగా వ్చిన ఓ లారీ ఢీకొట్టడంతో మృతిచెందింది. దీంతో స్థానికులు లారీని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.