సాక్షి, హైదరాబాద్: భూ వినియోగ మార్పిడి చార్జీలు భారీగా పెరిగాయి. నగరాలు, పట్టణాలు, పట్టణాభివృద్ధి సంస్థల మాస్టర్ ప్లాన్లో నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ/కన్జర్వేషన్/గ్రీన్ బెల్ట్, రిక్రియేషనల్ జోన్లలోని భూములను సంబంధిత కేటగిరీ కాకుండా ఇతరత్ర అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించేందుకు ప్రభుత్వం వసూలు చేస్తున్న అభివృద్ధి చార్జీలు 25 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయి. బుధవారం ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా), యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీలతో సహా రాష్ట్రంలోని ఇతర అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల మాస్టర్ ప్లాన్లలోని భూ వినియోగ మార్పిడికి ఇకపై వసూలు చేసే కొత్త చార్జీలను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ మినహాయిస్తే.. హెచ్ఎండీఏ పరిధిలోని మునిసిపాలిటీలతో పోల్చితే గ్రామ పంచాయతీల్లో చార్జీలు తక్కువగా ఉన్నాయి.
తాజాగా మున్సిపాలిటీలతో సమానంగా గ్రామ పంచాయతీల్లోని భూముల భూ వినియోగ చార్జీలను పెంచారు. హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారీగా నిధులను సమకూర్చుకోడానికి ప్రభుత్వం ఈ చార్జీలను పెంచిం ది. ఈ చార్జీల ద్వారా హెచ్ఎండీఏ ఏటా రూ.వందల కోట్లు ఆర్జిస్తోంది.
యాదగిరిగుట్ట భూములపై కూడా..
యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ ఆథారిటీ పరిధిలో భూ వినియోగ మార్పిడి చార్జీలను దాదాపు హెచ్ఎండీఏ పరిధిలోని చార్జీలకు సమానంగా పెంచారు. యాదగిరిగుట్ట పరిధిలో చ.మీ. స్థలానికి రూ.120 నుంచి రూ.200 వరకు చార్జీలను వసూలు చేయనున్నారు. కమర్షియల్, రెసిడెన్షియల్ కేటగిరీలకు మార్చేందుకు చ.మీ.కు రూ.200 అభివృద్ధి చార్జీని విధించనున్నారు. గుట్ట పరిధిలో పరిశ్రమల కేటగిరీకి మార్పు కోసం మాత్రం చ.మీ.కు రూ.120 చార్జీని ఖరారు చేశారు.
వేములవాడ, బాసర ఆలయాభివృద్ధి సంస్థల పరిధిలోనూ మున్సిపల్ కార్పొరేషన్లు/మున్సిపాలిటీల్లో చ.మీ.కు రూ.90 నుంచి రూ.120 వరకు చార్జీలను వసూలు చేయనున్నారు. నివాస కేటగిరీ నుంచి వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీలకు మార్చేందుకు రూ.120 చార్జీలు విధించనున్నారు. గ్రామ పంచాయతీల్లో చ.మీ.కు రూ.40 నుంచి రూ.60 వరకు వసూలు చేయనున్నారు.
ఇతర నగరాలు, పట్టణాల్లో..
హెచ్ఎండీఏ, కుడాలతో సహా రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా భూ వినియోగ మార్పిడి చార్జీలు పెరిగాయి. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు, గ్రేడ్-1, 2, 3 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రూ.10 నుంచి రూ.135 వరకు భూ వినియోగ చార్జీలు విధించనున్నారు.
భూ వినియోగ మార్పిడి చార్జీల బాదుడు
Published Thu, Sep 1 2016 3:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
రేప్ కేసు నిందితుడిపై పోలీసు కాల్పులు
అడవి వద్దు.. ఊరే ముద్దు
జలాసనం
● అరటి తోటలో పెద్ద పులి
కరెంటు షాక్తో రైతు మృతి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement