కశ్మీర్ సీఎం మృతి పట్ల తెలుగు సీఎంల సంతాపం | kcr and chandrababu condolences to Mufti Mohammad Sayeed | Sakshi
Sakshi News home page

కశ్మీర్ సీఎం మృతి పట్ల తెలుగు సీఎంల సంతాపం

Jan 7 2016 10:39 AM | Updated on Aug 15 2018 9:30 PM

అనారోగ్యంతో గురువారం కన్నుమూసిన జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్(79)కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు.

హైదారాబాద్: అనారోగ్యంతో గురువారం కన్నుమూసిన జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్(79)కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ సంతాపం తెలిపారు. తెలంగాణకు మఫ్తీ మహ్మద్ మద్దతుగా నిలిచారని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గుర్తు చేసుకున్నారు. అంత్యక్రియలకు రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ బృందం హాజరు కానున్నట్లు సమాచారం. ముఫ్తీ మహ్మద్ సయీద్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement