♦ ఇంజనీరింగ్ విద్యార్థి దేవిది హత్యే
♦ తల్లిదండ్రులు, బంధువుల ఆరోపణ
♦ భరత్ మరో ఇద్దరు కలసి చంపేశారు
♦ వారిని తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
♦ దేవి తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు అధికారి మార్పు..
♦ ఘటనపై మళ్లీ తొలి నుంచి విచారణ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థిని కట్కూరి దేవి అనుమానాస్పద మృతి అంశం ఎన్నో మలుపులు తిరుగుతోంది. తమ కుమార్తె ప్రమాదవశాత్తూ మరణించలేదని, ఆమెను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారన్న దేవి తల్లిదండ్రుల ఫిర్యాదుతో... పోలీసులు ఈ ఘటనపై తిరిగి మొదటి నుంచి దర్యాప్తు ప్రారంభించారు.ప్రమాదానికి గురైన కారును ఘటనా స్థలంలోకి తిరిగి తెప్పించి... పోలీసులతోపాటు ఫోరెన్సిక్ నిపుణులు, మోటారు వాహనాల అధికారులు పరిశీలించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో దేవి అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. గురువారం ఘటనా స్థలంలో పోలీసులు విచారణ జరుపుతుండగా.. దేవి బంధువులు, మిత్రులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రమాదం జరిగిన రోజున కారులో మరో ఇద్దరు ఉన్నారని, వారిని తప్పించారని ఆరోపించారు.
ప్రమాదం జరిగిన రోజున కారు ముందు భాగం చాలా తక్కువగా దెబ్బతిన్నదని... కానీ ఇప్పుడు పోలీసులు తీసుకువచ్చేటప్పటికి చాలా ఎక్కువ డ్యామేజీ ఉందంటూ దేవి సోదరి మానస చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రమాదం జరిగినప్పుడు తీసిన ఫొటోను ఆధారంగా చూపారు. పోలీసులు కావాలనే దోషులను తప్పిస్తున్నారని ఆరోపించారు. ఇక మరోవైపు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు అధికారులు విచారణాధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ సీఐ వెంకటరెడ్డిని తప్పించి.. ఏసీపీ ఉదయ్కుమార్రెడ్డికి కేసును అప్పగించారు.
దర్యాప్తు ముమ్మరం..
తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఉస్మానియా వైద్యులిచ్చిన పోస్టుమార్టం నివేదికను క్షుణ్నంగా పరిశీలించారు. తలకు బలమైన గాయాలు కావటం వల్లే ఆమె మరణించిందని, మిగతా శరీర భాగాలపై గాయాలేవీ లేవని ఆ నివేదిక పేర్కొంది. దీంతో తలపై గాయాలు ప్రమాదం వల్లే జరిగాయా, ఆ సమయంలో కారు ఎంత వేగంలో ఉండి ఉంటుందనే అంశాలపై ఫోరెన్సిక్, మోటార్ వాహనాల అధికారుల సహాయాన్ని తీసుకున్నారు. ఇక దేవి ఆదివారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరి ప్రమాదస్థలి వరకు ఏ మార్గంలో వచ్చారు, ఆ సమయంలో ఎవరెవరితో మాట్లాడారు, దేవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న యువకుల సెల్ఫోన్ టవర్ లోకేషన్లను పోలీసులు విశ్లేషించారు.
భరత్ వేసుకున్న దుస్తులు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగే ముందు దేవి, భరత్ ఇద్దరూ ఐదు నిమిషాలపాటు అక్కడ ఆగినట్లు గుర్తించారు. ఇక దేవి అనుమానాస్పద మృతిపై మొదటి నుంచి దర్యాప్తు చేపట్టామని, శాస్త్రీయ కోణంలో ముందుకు వెళుతున్నామని డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. నిజాయితీగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని, అపోహలకు తావు లేదని తెలిపారు.
దోషిగా తేలితే శిక్షించండి
కుమార్తె మరణించిన ఆవేదనలో దేవి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, భరత్ తప్పు చేశాడని తేల్చితే.. ఏ శిక్ష విధించినా సరే. అంతేగానీ పోలీసుల విచారణను అడ్డుకోవటం సరికాదు..
- భరత్ తల్లి సామ అనితారెడ్డి
ఎన్కౌంటర్ చేయాలి
మా అక్క మృతి పట్ల చాలా అనుమానాలున్నాయి. ఆ రోజు ఎన్నోసార్లు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. ఇంట్లో అందరం నిద్రాహారాలు మాని ఎదురుచూశాం. రోడ్డు ప్రమాదంలో చనిపోయిందనగానే నిశ్చేష్టులమయ్యాం. ఇందుకు కారకులైన వారిని ఎన్కౌంటర్ చేయాలి.
- దేవి సోదరి మానస
దేవిది మూమ్మాటికీ హత్యే
నా బిడ్డ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్నది కట్టుకథ. లోతుగా విచారణ జరిపితే దోషులెవరో తేలుతుంది. ఆమె వుృతి వెనుక మిస్టరీని ఛేదించాలి. ఆ రోజు కారులో భరతసింహారెడ్డితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరో గుర్తించాలి. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తే నిజాలు వెలికి వస్తాయి. ప్రమాదం జరిగిన కారును తీయడానికి గంటల సమయం పట్టే ఈ రోజుల్లో.. అరగంటలోనే కారును అక్కడి నుంచి ఎలా తొలగిస్తారు? దాన్ని దూరంగా రహ్మత్నగర్కు తరలించడం వెనుక అనుమానాలున్నాయి. దోషులు పట్టుబడే దాకా ఉద్యమిస్తాం.
- దేవి తండ్రి కట్కూరి నిరంజన్రెడ్డి
సాయం చేయాలంటూ అరుపులు వినిపించాయి
ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మా సార్ కార్లు కడగడానికి లేచాను. ఆ సమయంలో మా ఫ్లాట్ ముందు ఓ తెల్లరంగు కారు ఆగి ఉంది. కొద్దిసేపటికి కారు తలుపులు కొడుతున్న చప్పుడు వినిపించింది. తర్వాత కాసేపటికే కారులోంచి ఓ యువతి దిగి పరిగెత్తే ప్రయత్నం చేసింది. కానీ కార్లోంచి ఓ యువకుడు దిగి ఆమెను తిరిగి కారులోకి లాక్కెళ్లాడు. నేను నా పనిలో ఉండిపోయాను. కొద్దిసేపటికే హెల్ప్.. హెల్ప్ అన్న అరుపులు వినిపించాయి. నేను బయటకొచ్చి చూస్తుండగానే ఆ కారు దూసుకుపోయింది. కొద్దిసేపటికే కారు ప్రమాదం జరిగి, ఓ యువతి చనిపోయిందని తెలిసింది.
- వాచ్మన్ రాము, ప్రత్యక్ష సాక్షి
ఆ మరణం వెనక.. ఎన్ని మలుపులు
Published Fri, May 6 2016 4:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement