- మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రశ్నలు కఠినం
- కాస్త సులువుగా కెమిస్ట్రీ ప్రశ్నలు
- 35 % కటాఫ్.. తగ్గించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: జాయింట్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షలో ప్రశ్నలు అభ్యర్థులకు చుక్కలు చూపించాయి. పేపర్ 1, 2ల్లోనూ మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రశ్నలు చాలా కఠినంగా వచ్చాయని అభ్యర్థులు చెబుతున్నారు. కెమిస్ట్రీలో ప్రశ్నలు కొంతమేర సులువుగా ఉన్నాయంటున్నారు. గతేడాది రెం డు పేపర్లు కలిపి మొత్తం 506 మార్కులకు ప్రశ్నలివ్వగా, ఈ ఏడాది 372 మార్కులకు ప్రశ్నలిచ్చారు. మొత్తం మార్కుల్లో 35 శాతం మార్కులొస్తే ర్యాంకులు ఇస్తామని పరీక్ష నిర్వహించిన ఐఐటీ గువాహటి ఇప్పటికే ప్రకటించింది. గతేడాది కూడా కటాఫ్ మా ర్కులను 35 శాతంగా ప్రకటించినా చివరి నిమిషంలో 25 శాతానికి తగ్గించారు.
ఈ ఏడాది కూడా కటాఫ్ మార్కులను తగ్గించి ర్యాంకులిచ్చే అవకాశం ఉదని ఐఐటీ-జేఈఈ ఫోరం కన్వీనర్ లలిత్ కుమార్ తెలిపారు. 50 శాతం మార్కులు సాధిస్తే మంచి ఐఐటీలో మంచి బ్రాంచ్లో సీటు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. నెగెటివ్ మార్కులపై ఈ ఏడాది సంపూర్ణమైన అవగాహనతో పరీక్ష రాసినందున ఆలిండియా టాప్ ర్యాంకుల్లో మూడు నుంచి నాలుగు ర్యాంకులు రాష్ర్ట విద్యార్థులకే దక్కే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రెండు పేపర్లలోనూ కాంప్రహెన్సివ్, సింగిల్ ఆప్షన్ ప్రశ్నలు తేలిగ్గా ఉన్నాయని, మల్టిపుల్ ఆప్షన్లు, ఇంటీజర్ టైప్ ప్రశ్నలు అభ్యర్థులను బాగా ఇబ్బందికి గురిచేశాయని ఫిట్జీ-ఐఐటీ అకాడమీ ప్రిన్సిపల్ నాగ రవి తెలిపారు. కొన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలంటే సుదీర్ఘమైన లెక్కలు చేయాలని, కాలిక్యులేటర్లు లేకుండా సమాధానం చేయ డం చాలా కష్టమని పేర్కొన్నారు. సింగిల్ ఆప్షన్ టైప్ ప్రశ్నల్లో ఒకట్రెండు ప్రశ్నలకు సరైన సమాధానం లేదన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రం లో మహబూబ్నగర్, హైదరాబాద్, వరంగల్ ప్రధాన కేంద్రాలుగా జరిగిన ఈ పరీక్షకు 95 శాతం హాజరు నమోదైనట్లు సమాచారం. కాగా, దేశవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది అడ్వాన్స్డ్కు అర్హత సాధించగా ఆదివారం నాటి పరీక్షకు 19, 820 మంది ఆన్లైన్లో, 1,78,408 మంది ఆఫ్లైన్లో రాశారు.
చుక్కలు చూపిన జేఈఈ అడ్వాన్స్డ్
Published Mon, May 23 2016 3:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement