ఒక్క రోజు.. 54.74 మిలియన్ యూనిట్లు
గ్రేటర్ డిస్కం చరిత్రలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ప్రచండ భానుడి ప్రతాపం.. మరోవైపు ఉక్కపోత.. వడగాడ్పులు.. దీంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు చలిగాలులతో ఎంతో ఆహ్లాదంగా ఉన్న ఈ మహానగరం రోజురోజుకూ పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో తల్లడిల్లిపోతోంది. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్ వినియోగం రెట్టింపైంది. విద్యుత్ పంపిణీ సంస్థ చరిత్రలోనే అత్యధికంగా ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన 54.74 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గత ఏడాది మే 26న రికార్డు స్థాయిలో 53.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగగా, ఈ ఏడాది నెల రోజుల ముందే ఆ రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం. రానున్న రోజుల్లో ఇది 58 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్ చూస్తే విద్యుత్ అధికారులకే ముచ్చెమటలు పడుతున్నాయి.
ఉడుకుతున్న కేబుళ్లు..
గ్రేటర్ పరిధిలో 39 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 32.5 లక్షలు గృహ, 5.5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు మరో 40 వేలకుపైగా ఉన్నాయి. వీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైన విద్యుత్ ఉన్నా పగటి ఉష్ణోగ్రతలకు తోడు ఒక్కసారిగా వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో ట్రాన్స్ఫార్మర్లపై తీవ్ర భారం పడుతోంది. సూర్యుని ప్రతాపానికి విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ వైర్లు కరిగి సాగిపోతున్నాయి. భూగర్భ కేబుళ్లు వేడికి ఉడికిపోయి జాయింట్స్ వద్ద కాలిపోతున్నాయి. ఇలా ప్రతిరోజూ రెండు, మూడు ఫీడర్ల పరిధిలో ఈ సమస్య తలెత్తుతోంది. మరోవైపు ఆయిల్ లీకేజీలకు తోడు ఓవర్ లోడ్ వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వీటి స్థానంలో కొత్త వాటిని అమర్చి విద్యుత్ పునరుద్ధరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు అత్యవసర లోడ్ రిలీఫ్ల పేరుతో కోతలు అమలు చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న శివారు ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.
24 గంటలు విద్యుత్ సరఫరా..
వేసవి డిమాండ్పై ముందే ఓ అంచనాకు వచ్చాం. ఇప్పటికే లైన్స్ను పునరుద్ధరించాం. పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశాం. రూ.240 కోట్లు ఖర్చు చేసిసరఫరా వ్యవస్థను అభివృద్ధి చేశాం. ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో మినహా కోతలు అమలు చేయడం లేదు. విద్యుత్ సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- శ్రీనివాసరెడ్డి, డెరైక్టర్, ఆపరేషన్స్, టీఎస్ఎస్పీడీసీఎల్
ఇది ఆల్టైమ్ రికార్డ్
Published Sun, Apr 10 2016 4:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పిడుగుపడి 48 గొర్రెలు మృతి
బీసీలను విస్మరించారు.. ఓటుతో సత్తా చాటుతాం
గెలిచే సీట్లలో నాగర్కర్నూల్ ఒకటి..
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం
కాంగ్రెస్తోనే వికలాంగుల సంక్షేమం..
ఎన్నికల విధులపై అవగాహన అవసరం
నేడు కేటీఆర్ రోడ్షో
బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆందోళన
కొలతల ప్రకారం‘ఉపాధి’ పనులు చేపట్టాలి
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement