ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ | icet coucelling notification released | Sakshi
Sakshi News home page

ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ

Aug 23 2015 10:13 AM | Updated on Sep 3 2017 8:00 AM

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను జారీచేసినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు.

హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను జారీచేసినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఐసెట్‌లో అర్హత సాధించిన 58,037 మంది విద్యార్థులకు ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతామని పేర్కొన్నారు. వెరిఫికేషన్ చేయించుకున్న విద్యార్థులు 28 నుంచి 31వరకు వెబ్ ఆప్షన్లను tsicet.nic.in వెబ్‌సైటల్లో ఇచ్చుకోవచ్చన్నారు. విద్యార్థులకు వచ్చే నెల 2న సాయంత్రం 6 గంటలకు సీట్లు కేటాయిస్తామని వివరించారు.


ఇదీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షెడ్యూలు..
27న 1 నుంచి 15 వేల ర్యాంకు వరకు
28న 15,001 నుంచి 30 వేల ర్యాంకు వరకు
29న 30,001 నుంచి 45 వేల ర్యాంకు వరకు
30న 45,001 నుంచి చివరి ర్యాంకు వరకు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement