జీఎస్టీ చట్టంతో హోటల్ రంగం మరింత కుదేలయ్యే పరిస్థితి ఉందని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సద్ది వెంకట్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
జూన్ 1న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఖైరతాబాద్లోని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ గౌరవ చైర్మన్ నాగరాజు, బేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బర్కత్ విలానీ, సెక్రటరీ జగదీశ్వర్రావు మాట్లాడుతూ.. జీఎస్టీ చట్టం ద్వారా హోటళ్ల వారిని కొందరు అధికారులు వేధించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు అశోక్ రెడ్డి, శ్రీనివాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.