‘దళితులపై దాడులను పట్టించుకోని సీఎం’ | GVS leader shankar nayak fires on ap cm over attacks on dalits | Sakshi
Sakshi News home page

‘దళితులపై దాడులను పట్టించుకోని సీఎం’

Aug 13 2016 8:26 PM | Updated on Aug 18 2018 6:11 PM

దళితులపై దాడులను నిరోధించేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని శంకర్ నాయక్ ఆరోపించారు.

హైదరాబాద్‌: దళితులపై దాడులు జరుగుతున్నా వాటిని నిరోధించేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని గిరిజన విద్యార్థి సమాఖ్య (జీవీఎస్) నేత వడిత్యా శంకర్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు.

అమలాపురం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆవు చర్మాన్ని తొలగిస్తున్న దళితులపై అత్యంత దారుణంగా దాడి చేయడం నీచమైన చర్య అన్నారు. ప్రభుత్వం ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణించాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement