'రుణమాఫీపై ప్రభుత్వం సమాధానం దాటవేస్తోంది' | Sakshi
Sakshi News home page

'రుణమాఫీపై ప్రభుత్వం సమాధానం దాటవేస్తోంది'

Published Mon, Oct 5 2015 10:38 AM

'రుణమాఫీపై ప్రభుత్వం సమాధానం దాటవేస్తోంది' - Sakshi

హైదరాబాద్ : రుణమాఫీ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సమాధానం దాటవేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. శాసనసభలో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన పట్టుబట్టారు. ఒకే దఫాలో రైతుల రుణమాఫీ చేయాల్సిందేనని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కరవు మండలాలను ప్రభుత్వం కచ్చితంగా ప్రకటించాల్సిందేనని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement