-
మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జైలుశిక్ష
సాక్షి, ఖమ్మం : పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జైలుశిక్ష పడింది. ఆయనకు 6 నెలల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఎన్నికల్లో డబ్బులు పంచారన్న అభియోగాలు రుజువైనట్లు ప్రజా ప్రతినిధుల కోర్టు వెల్లడించింది. 2018లో అశ్వాపురం పీఎస్లో పాయం వెంకటేశ్వర్లుపై ఈ మేరకు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై కోర్టు గురువారం విచారణ జరిపి, తీర్పు నిచ్చింది. ఆయన రూ. 10 వేల జరిమానాను కట్టారు.. అప్పీలుకు వెళ్లేందుకు సిద్ధపడటంతో కోర్టు జైలు శిక్ష నిలిపివేసింది. -
కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం
సాక్షి,బూర్గంపాడు: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం అని పినపాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు సతీమణి పాయం ప్రమీల అన్నారు. శుక్రవారం సారపాకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో రూ.లక్ష ఆర్థిక చేయూతనందిస్తున్నామన్నారు. అదేవిధంగా రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.8వేలు, రూ.5లక్షల బీమా, 24గంటల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలో అమలు కావటం లేదన్నారు. కేసీఆర్ పథకాలు దేశంలోని మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా గాంధీనగర్, భాస్కర్నగర్ గ్రా మాలకు చెందిన 200కుటుంబాలు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో మార్కెట్కమిటీ చైర్పర్సన్ సూరపాక విజయనిర్మల, బిజ్జం శ్రీనివాసరెడ్డి, గొనె దారుగా, పాండవుల మధు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యేకు గాయాలు
సాక్షి, బూర్గంపహాడ్ : రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పినపాక పట్టి నగర్ వద్ద చోటుచేసుకుంది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కారు, ఓ ట్రాలీ ఆటో ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. ఈ ఘటనలో పాయం వెంకటేశ్వర్లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పొలాల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఎమ్మెల్యే వెంకటేశ్వర్లుకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఎమ్మెల్యే కారులో హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డ ఎమ్మెల్యేను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
ప్రగతికి బాటలు వేస్తా
♦ పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే ♦ ప్రతి ఎకరాకూ సాగునీరే లక్ష్యం ♦ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి ♦ పాలనా సౌలభ్యం కోసమే ఆళ్లపల్లి, కరకగూడెం మండలాలు ♦ మౌలిక సౌకర్యాలతో పాటు అన్నిరంగాల అభివృద్ధిపై ద్రుష్టి మణుగూరు : ‘అభివృద్ధిలో పినపాక నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెడతా. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో పనిచేస్తా. మణుగూరు పట్టణాభివృద్ధిపై దృష్టి సారిస్తా. అత్యంత వెనుకబడిన గుండాల మండలాన్ని రోడ్ల నిర్మాణంతో ప్రగతి పథం పట్టిస్తా. పాలనా సౌలభ్యం కోసమే నియోజకవర్గంలో ఆళ్లపల్లి, కరకగూడెంలను నూతన మండలాలుగా ఏర్పాటు చేసేందుకు సీఎంను ఒప్పించాం. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిలో భాగస్వామిగా ఉంటాను. మండలాల వారీగా ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతాను. ’ అని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శాసనసభ్యునిగా ఎన్నికై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రెండేళ్లలో అభివృద్ధిపై... మొదటి శాసనసభ సమావేశాల్లో భద్రాద్రి పవర్ ప్లాంట్ గురించి ప్రస్తావించాను. సీఎంతో అనేకసార్లు మాట్లాడి రూ.7,250 కోట్ల థర్మల్ ప్లాంటు సాధించా. ఇప్పటివరకు నియోజకవర్గంలోని 307 చెరువులను రూ.82 కోట్లతో అభివృద్ధి చేశా. మరో నెల రోజుల్లో బూర్గం పాడు మండలంలో 7,500 ఎకరాలకు సాగునీరు అందించే కిన్నెరసాని ఎడమ కాలువ పనులు పూర్తి కానున్నాయి. మణుగూరుకు 100 పడకల ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. రూ.3కోట్ల సీడీపీ నిధులతో సీసీరోడ్లు,డ్రెయిన్లు, బోర్లు వేయించా. బూర్గంపాడు-ఏటూరునాగారం రహదారిని జాతీయ రహదారిగా మార్పించా. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. వైద్య, ఆరోగ్య మంత్రితో మాట్లాడి ఆళ్లపల్లి, పినపాక, బూర్గంపాడు పీహెచ్సీలకు అంబులెన్స్లు మంజూరు చేయించా. మణుగూరు మండలం పేరంటాలచెరువుకు రూ.కోటి మంజూరు చేయించా. టెండర్లు పిలి చారు. వర్షాకాలం తరువాత పనులు ప్రారం భమవుతాయి. మిషన్భగీరథ ద్వారా 2017 డిసెంబర్కు నియోజకవర్గంలో అన్ని ఇళ్లకు నల్లా నీరు వస్తుంది. మొండికుంట, ఆళ్లపల్లి విద్యుత్ ఉపకేంద్రాలు మంజూరు చేయించా. పినపాక మండలం మల్లారం, అశ్వాపురం, బూర్గం పాడు, గుండాల మండలం మర్కోడుల్లో రూ.5.5 కోట్లతో వ్యవసాయ గిడ్డంగులు మంజూరు చేయించా. రూ.2 కోట్లతో అంగన్వాడీ భవనాలు కట్టించా. రూ.8.50 కోట్లతో మణుగూరు మున్సిపాలిటీలో రోడ్లు, డ్రెయిన్లు వేయించా. రూ.2.23 కోట్లతో మణుగూరులో మినీ ట్యాంక్బండ్ మంజూరు చేయించా. నీటిపారుదల, వ్యవసాయంపై..? నియోజకవర్గంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నా. వచ్చే విడత మిషన్ కాకతీయలో అన్ని చెరువులు పూర్తి చేయిస్తా. పినపాక మండలంలో 28 గిరిజన గ్రామాల్లోని 10వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంతో రూ.90కోట్ల అంచనాతో పులుసుబొంత ప్రాజెక్టు నిర్మించేందుకు కృషి చేస్తున్నా. దీనిపై శాసనసభలో, సీఎంతోనూ మాట్లాడా. అటవీ, రెవెన్యూ, శాటిలైట్ సర్వేలు కూడా పూర్తయ్యాయి. ఈ ఏడాది నిధులు మంజూరు అవుతాయి. పినపాక మండలం గొడుగుబండ వద్ద 900ఎకరాలకు సాగునీరు అందించే రూ.9కోట్ల వట్టివాగు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయి. గోదావరిపై పినపాక మండలం భూపతిరావుపేట, చింతలబయ్యారం, మణుగూరు మండలం అన్నారం లిఫ్ట్లకు ప్రతిపాదనలు పంపా. వీటితో ఆరువేల ఎకరాలు సాగులోకి వస్తాయి. సమితిసింగారం పరిధిలో 2వేల ఎకరాలకు నీరందించే రేగులగండికి రూ.1.10 కోట్లతో టెండర్లు పిలిచారు. త్వరలో పనులు ప్రారంభం అవుతాయి. ఏడీఏ కార్యాలయం నియోజకవర్గ కేంద్రం మణుగూరుకు మార్చడంతో పాటు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇదే ఫార్ములా అమలు అయ్యేలా చేశా. విద్య, వైద్యంపై...? నియోజకవర్గానికి ఒక ఎస్సీ, మరొక ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయించా. ఇందులో 5 నుంచి ఇంటర్ వరకు బోధిస్తారు. గిరిజన బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, వృత్తివిద్యా కళాశాల, పాలి టెక్నిక్ కళాశాలలకు ప్రతిపాదనలు పంపా. ఇప్పటికే ఐటీఐ, డిగ్రీ కళాశాలలు సాధించా. సీహెచ్సీ వైద్యులు క్షేత్రస్థాయి శిబిరాలు పెట్టకుండా అంబులెన్స్లు ఆగిపోయాయి. మొండికుంట, బూర్గంపాడు, మణుగూరుల్లో కొత్త పీహెచ్సీలకు ప్రతిపాదనలు పంపా. రోడ్డు కమ్యూనికేషన్ల వ్యవస్థ అభివృద్ధిపై...? బూర్గంపాడు-ఏటూరునాగారం రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు కృషి చేశా. కిన్నెరసాని, మల్లన్నవాగు, జల్లేరువాగు, ఏడుమెలికలవాగులపై వంతెనలు, శాశ్వత రోడ్ల కోసం కృషి చేస్తున్నా. గుండాల-సాయనపల్లి-దామెరతోగు, చెట్టుపల్లి-కొమరారం రోడ్లు పీఆర్ నుంచి ఆర్అండ్బీకి బదలాయించాం. దీనికి మంత్రి తుమ్మల ఇచ్చిన సహకారం మరువలేనిది. గొల్లగూడెం-చొప్పాల వంతెనకు రూ.4.5 కోట్లు మంజూరు చేయించా. ఇక్కడ బ్రిడ్జి కమ్ చెక్డ్యాం నిర్మిస్తాం. మారుమూల ప్రాంతాలు..? మారుమూల ప్రాంతాల అభివృద్ధిపై స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నా. కొత్తగా గుండాల నుంచి ఆళ్లపల్లి, పినపాక నుంచి కరకగూడెం మండలాలు ఏర్పాటు చేయాలని భౌగోళిక వివరాలతో సీఎంను కోరాను. దీనికి ఆయన అంగీకరించారు. మణుగూరు పట్టణ అభివృద్ధిపై..? మణుగూరులో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు మంత్రి తుమ్మల సహకారంతో ప్రత్యేక కృషి చేస్తున్నా. ఇప్పటికే నాయుడుకుంట మినీ ట్యాంక్బండ్కు రూ.2.23కోట్లు మంజూరు చేయించా. మరో రూ.3.30కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చా. చినరావిగూడెం-పర్ణశాల మధ్య గోదావరిపై వంతెన కోసం రూ.150కోట్లు మంజూరయ్యే అవకాశం ఉంది. -
ఎంతకైనా తెగిస్తాం
♦ మీరు ఇటుకతో కొడితే.. మేం రాయితో కొడతాం ♦ చంద్రబాబు సర్కారు తీరుపై సీఎం కేసీఆర్ ఫైర్ ♦ ఏపీలో చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలపై యుద్ధమా? ♦ లేచికూర్చున్న బెబ్బులిని కదిలించొద్దు.. తీరు మార్చుకోకుంటే మీకే నష్టం ♦ గోదావరిలో నీళ్లు తీసుకునే దమ్ము, వివేకం, తెలివి ఏపీకి లేవు ♦ మీ ఆటలు ఇక సాగవు.. ఉన్న విలువ పోగొట్టుకోవద్దు.. ♦ తెలంగాణ రైతాంగం బోర్లు వేసి బోర్లా పడింది.. బోర్ల కోసం రూ.38 వేల కోట్లు ఖర్చు చేసిన దుస్థితి తెలంగాణది ♦ టీఆర్ఎస్లో చేరిన ఖమ్మం ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే పాయం సాక్షి, హైదరాబాద్: తాము న్యాయంగా ప్రాజెక్టులు కట్టుకుంటుంటే ఏపీ సర్కారు చిల్లరమల్లర రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తామని కుండబద్దలు కొట్టారు. ఏపీ నాయకులు చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలని.. లేచి కూర్చున్న బెబ్బులిని కదిలించవద్దని హెచ్చరించారు. అది వారికే నష్టమని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ కేబినెట్ చేసిన తీర్మానం, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్. జగన్మోహన్రెడ్డి దీక్ష ప్రకటనపై మండిపడ్డారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు, సాగునీటి మంత్రులు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే కృష్ణా నదిలో 368 టీఎంసీలు, గోదావరిలో 950 టీఎంసీలను తెలంగాణకు కేటాయించారు. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి, కొబ్బరికాయలు కొట్టారు. పాలమూరు ప్రాజెక్టు పనులకు రూ.7కోట్లు కూడా మంజూరు చేశారు. ఆ కేటాయింపుల మేరకే ఇప్పుడు ప్రాజెక్టులు కట్టుకుంటామంటుంటే ఏపీ రాజకీయ నేతలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు, జగన్ మనపై యుద్ధం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తీరుతాం. న్యాయంగా పోరాడుతాం. ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీ సర్కారుకు దమ్ము లేదు! ఏపీకి గోదావరిలో నీటిని తీసుకునే దమ్ము లేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘నేను యాగం చేసినప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు అమరావతి వెళ్లాను. కనీసం గంట పాటు గోదావరి జలాల గురించి మాట్లాడిన. మూడు నాలుగు వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్లిపోతోందని... తెలంగాణ వాటా తీసుకున్నాక, ఏపీ బాగా తీసుకోవచ్చని చెప్పిన. అసెంబ్లీ వేదికగా అధికారికంగా సీఎం హోదాలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనూ లెక్కలు చెప్పిన. వాస్తవానికి గోదావరి నుంచి నీళ్లు తీసుకోవడం తెలంగాణకే కష్టం. 500 మీటర్లు ఎత్తిపోయాలి. అదే ఏపీ అయితే 50 మీటర్ల నుంచి 250 మీటర్లు లిఫ్టు చేస్తే చాలు. అయినా ప్రతీ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారు. మేం బతుకుతం.. మీరు బతుకొద్దనడం దుర్మార్గం. అయినా గోదావరిలో నీటిని తీసుకునే దమ్ము మీకు లేదు. వివేకం, తెలివి లేదు. తెలంగాణపై ఎందుకు ఏడుస్తున్నరు. తెలంగాణ ఇప్పుడు స్వతంత్ర రాష్ట్రం. మీ బెదిరింపులకు భయపడం. మీరు ఇటుకతో కొడితే మేం రాయితో కొడతం. మీ ఆటలు ఇక సాగవు. ఉన్న విలువ పోగొట్టుకోవద్దు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యంగనే ఉంటం. ఏపీ, తెలంగాణ పరస్పరం సహకరించుకోవాలె. కుతంత్రాలు మానండి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను బలిపెట్టొద్దు. చంద్రబాబు నీతేమిటో, వైఎస్సార్సీపీ నీతేమిటో మాకు తెలుసు. కడుపులో కత్తులు పెట్టుకుని, నోట్లో బెల్లం పెట్టుకుని మాట్లడుతరు..’’ అని విమర్శించారు. తెలంగాణది వలసల దుస్థితి.. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నిధులు-నీళ్లు-నియామకాల్లో అన్యాయం జరుగుతోందనే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గత 58 ఏళ్లలో బోర్లు వేసి తెలంగాణ రైతాంగం బోర్లా పడిందని.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ 24 లక్షల పంపుసెట్లు ఉన్నాయని చెప్పారు. సుమారు రూ.30వేల కోట్ల నుంచి రూ.38వేల కోట్ల దాకా బోర్ల కోసం ఖర్చు చేశారన్నారు. తెలంగాణది వలస బతుకని, 37 లక్షల జనాభా ఉన్న మహబూబ్నగర్ జిల్లా నుంచి 18 లక్షల మంది వలస పోయారని చెప్పారు. అలాంటి ప్రాంతానికి నీళ్లివ్వొద్దంటూ దాడి చేస్తున్నరని మండిపడ్డారు. దుమ్ముగూడెం దగ్గర ఇప్పటికీ వేల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్లిపోతోందన్నారు. సరిహద్దుగా గోదావరి నది ఉన్నా ఖమ్మం జిల్లా కరువు, తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నది సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం వల్లేనని కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్కు నిబద్ధత ఉంది తెలంగాణ సమాజమంతా ఏకం కావాల్సిన సందర్భమిదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘వైఎస్సార్సీపీ నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరడానికి కారణం ఉంది.. ఇవి చిల్లర మల్లర చేరికలు కావు. రాజకీయ ఏకీకరణలో భాగం. టీఆర్ఎస్లో కొత్త వారికి కూడా పాత వారితో సమాన స్థాయి గౌరవం ఉంటుంది.. టీఆర్ఎస్ నిబద్ధత ఉన్న పార్టీ. ఉద్యమంలో అనేక బాధలు పడ్డాం. అందుకే ప్రజలు అధికారం ఇచ్చారు. మంత్రి తుమ్మలను ఒకటే కోరుతున్నా... పాలు నీళ్లలా అందరినీ కలుపుకొని వెళ్లాలి..’’ అని సూచించారు. అవకాశాలు అందరికీ వస్తాయని, సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, పువ్వాడ అజయ్, తాటి వెంకటేశ్వర్లు, మదన్లాల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వాదులుగానే చేరాం: పొంగులేటి, పాయం వెంకటేశ్వర్లు తెలంగాణవాదులుగా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకే తాము టీఆర్ఎస్లో చే రినట్లు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. కృష్ణా నీటి విషయంలో, పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దీక్ష చేస్తానన్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన చూసి తట్టుకోలేక పోయానని చెప్పారు. ఏపీ విషయంలో ఆయన పోరాటంలో న్యాయం ఉందని, కానీ తెలంగాణ విషయంలో అది ఏకపక్ష నిర్ణయమని పేర్కొన్నారు. తెలంగాణలో ఇబ్బంది ఎదురవుతుందని తెలిసినా జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారని... ఇది ఏపీ విషయంలో సరైనదే అయినా, తెలంగాణ విషయంలో అన్యాయమని వ్యాఖ్యానించారు. ఇక బంగారు తెలంగాణలో భాగస్వామి కావడానికి టీఆర్ఎస్లో చేరానని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement