కట్టుకథల రూపంలో వార్తలా? | thati-venkateswarlu-payam-venkateswarlu-continued-in-ysrcp | Sakshi
Sakshi News home page

Oct 9 2014 8:52 PM | Updated on Mar 22 2024 11:21 AM

తాము గెలిచిన రోజు నుంచి కొన్ని వార్తా చానళ్లు, పత్రికలు తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వార్లు, పాయం వెంకటేశ్వర్లు అన్నారు. తాము పార్టీ మారతామంటూ కట్టుకథలు అల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజక అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సీఎం కేసీఆర్ ను కలుస్తున్నామని స్పష్టం చేశారు. పినపాకలో పవర్ ప్లాంట్ ఏర్పాటు, స్థానికుల ఉపాధి గురించి ముఖ్యమంత్రిని కలిసినట్టు వివరించారు. తాము పార్టీ మారతామన్నది ఊహాజనిత కథనమని కొట్టిపారేశారు. ఆదివాసీ ఎమ్మెల్యేలమైన తమపై కట్టుకథల రూపంలో వార్తలు రావడం బాధాకరమని వాపోయారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement