వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మణుగూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన చేశారు.
ప్లీనరీలో ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షులు జగన్
ఖమ్మం అర్బన్, న్యూస్లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మణుగూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన చేశారు. పార్టీ రెండు ప్లీనరీ ఆదివారం కడప జిల్లా ఇడుపులపాయలో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు, పది నియోజకవర్గాల ఇన్చార్జిలు, ఇతర అనుబంధ సంఘాల నాయకులు భారీ ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి వారితో జగన్ సమీక్షించారు.
అనంతరం ప్రస్తుతం పార్టీ జిల్లా కన్వీనర్గా ఉన్న పాయం వెంకటేశ్వర్లును అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. పాయం నియామకం పట్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో హర్షం వెలిబుచ్చారు.