'ఏపీ శాసనసభలో ప్రాతినిధ్యం కల్పించండి' | Khammam MLAs approach EC for AP Assembly representation | Sakshi
Sakshi News home page

'ఏపీ శాసనసభలో ప్రాతినిధ్యం కల్పించండి'

Nov 18 2014 4:36 PM | Updated on Sep 2 2017 4:41 PM

ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిశారు.

హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య (భద్రాచలం) మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కమిషనర్ ను కోరారు.

తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లాయని తెలిపారు. 2019 వరకు తమకు ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఈనెల 14న గవర్నర్ నరసింహన్ ను కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement