Sakshi News home page

'చంద్రబాబు జిరాక్స్ సుజనాచౌదరి'

Published Sat, Apr 19 2014 2:47 PM

'చంద్రబాబు జిరాక్స్ సుజనాచౌదరి' - Sakshi

తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్లు మనీల్యాండరీంగ్ ద్వారా విదేశాల నుంచి వేల కోట్లు రూపాయిలు రాష్ట్రానికి తరలిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో గట్టు రామచంద్రరావు విలేకర్లతో మాట్లాడుతూ.... సుజనా చౌదరిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  జిరాక్స్ సుజనా చౌదరి అని ఆయన ఆరోపించారు. ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. సుజనాచౌదరి మనీ ల్యాండరింగ్ కుంభకోణంపై విచారణ జరపాలని గట్టు రామచంద్రరావు ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

What’s your opinion

Advertisement