నేటి నుంచి డిగ్రీ తుది కౌన్సెలింగ్‌ | Final degree of counseling from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి డిగ్రీ తుది కౌన్సెలింగ్‌

Jul 22 2017 12:47 AM | Updated on Sep 5 2017 4:34 PM

డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో భాగంగా తుది దశ కౌన్సెలింగ్‌ను ఈనెల 22 నుంచి ప్రారంభించనున్నట్లు

- 31 వరకు అథెంటికేషన్, రిజిస్ట్రేషన్, వెబ్‌ ఆప్షన్లు 
అందుబాటులో 2,57,479 సీట్లు
 
సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో భాగంగా తుది దశ కౌన్సెలింగ్‌ను ఈనెల 22 నుంచి ప్రారంభించనున్నట్లు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వెంకటాచలం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 22 నుంచి 31వ తేదీ వరకు తుది దశ ప్రవేశాల కోసం మీసేవా కేంద్రాలు/కాలేజీల హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో బయోమెట్రిక్, ఆధార్‌ అథెంటికేషన్‌ చేయించుకోవాలని సూచించారు. 31లోగా ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్‌ చేసుకొని వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని పేర్కొన్నారు.

మొదటి, రెండో దశ కౌన్సెలింగ్‌ కోసం ఇది వరకే అథెంటికేషన్, రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు. తమ ఐడీ నంబర్‌తో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించారు. గేమ్స్, స్పోర్ట్స్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, క్యాప్, వికలాంగులు అదనపు కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ సర్టిఫికెట్లు కలిగిన వారు యూనివర్సిటీల హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో ఈనెల 28, 29 తేదీల్లో వెరిఫికేషన్‌ చేయించుకోవాలని సూచించారు. మొదటి, రెండు దశల్లో సీట్లు పొందిన వారిలో 1,51,588 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరగా, తుది దశ కౌన్సెలింగ్‌లో 2,57,479 సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థు లకు వచ్చే నెల 4వ తేదీన సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులంతా వచ్చే నెల 4వ తేదీ నుంచి 11వ తేదీలోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. వెబ్‌సైట్‌ నుంచి (dost. cgg.gov.in) సీట్‌ అలాట్‌మెంట్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని కాలేజీకి వెళ్లి సీటు కన్‌ఫర్మ్‌ చేయించుకోవాలని వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement