ఐటీ అధికారులమని చెప్పి.. పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు
హైదరాబాద్: ఐటీ అధికారులమని చెప్పి.. ఓ వ్యక్తి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వికారాబాద్కు చెందిన ఓ వ్యక్తి నోట్లను మార్చుకోవడానికి నగరానికి వస్తుండగా.. ‘ఎర్రబుగ్గ’ కారులో వచ్చిన ఓ ముఠా.. ఐటీ అధికరారులమని చెప్పి.. రూ. 9.2 లక్షల నగదుతో ఉడాయించారు. ఆలస్యంగా తేరుకున్న బాధితుడు లంగర్హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నకిలీ ఐటీ అధికారుల ముఠాను ఆదివారం అరెస్ట్ చేశారు.