కాంగ్రెస్ నిరసన తెలుపుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు భయం పట్టుకుందని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ప్రశ్నించారు.
టీఆర్ఎస్కు ఎందుకంత భయం: జానారెడ్డి
Apr 17 2017 3:50 PM | Updated on Jul 29 2019 7:38 PM
హైదరాబాద్: ప్రజాస్వామ్య పద్దతిలో కాంగ్రెస్ నిరసన తెలుపుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు భయం పట్టుకుందని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ..ధర్నా చౌక్ పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామన్నారు. ధర్నా చౌక్ తరలింపు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని అన్నారు. భవిష్యత్ లో టీఆర్ఎస్ను ప్రజలే దూరం పెడతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రజల గొంతు నొక్కలేరని తెలిపారు.
Advertisement


