కాళేశ్వరానికి కాంగ్రెస్‌ ఆటంకాలు | Congress interrupts Kaleshvaram project | Sakshi
Sakshi News home page

కాళేశ్వరానికి కాంగ్రెస్‌ ఆటంకాలు

Aug 25 2017 3:33 AM | Updated on Mar 18 2019 7:55 PM

కాళేశ్వరానికి కాంగ్రెస్‌ ఆటంకాలు - Sakshi

కాళేశ్వరానికి కాంగ్రెస్‌ ఆటంకాలు

కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ విశ్వ ప్రయత్నం చేస్తోందని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ మండిపడ్డారు.

సుమన్
సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ విశ్వ ప్రయత్నం చేస్తోందని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ మండిపడ్డారు. పెద్దపల్లిలో బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని రచ్చ చేసేందుకు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత శ్రీధర్‌బాబు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన ఎమ్మెల్సీ భానుప్రసాద్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రైతులు పచ్చగా ఉండడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, వారి కుట్ర పూరిత వైఖరిని రైతులు ప్రజాభిప్రాయ సేకరణలోనే ఎండగట్టారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ఆరు నెలల్లో 36 కేసులు వేశారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement