Sakshi News home page

సీఎంకు ప్రతిపక్షాలంటే చిన్నచూపు: చాడ

Published Fri, Apr 29 2016 2:02 AM

సీఎంకు ప్రతిపక్షాలంటే చిన్నచూపు: చాడ - Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాలంటే సీఎం కేసీఆర్‌కు ఎలర్జీ, చిన్నచూపు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి మరింత కరువు సహాయాన్ని సాధించేందుకు ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలన్న విజ్ఞప్తులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని, మండలానికి రూ.10 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంచినీరు, పశుగ్రాసం సరఫరా చేయాలని కోరినా  చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరువుపై మే 6న ఇందిరాపార్కు వద్ద సామూహిక ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొన్ని మండలాలను కాకుండా మొత్తం రాష్ట్రాన్ని కరువుగా ప్రభావితంగా ప్రకటించాలని  డిమాండ్ చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement