సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాలంటే సీఎం కేసీఆర్కు ఎలర్జీ, చిన్నచూపు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి మరింత కరువు సహాయాన్ని సాధించేందుకు ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలన్న విజ్ఞప్తులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని, మండలానికి రూ.10 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంచినీరు, పశుగ్రాసం సరఫరా చేయాలని కోరినా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరువుపై మే 6న ఇందిరాపార్కు వద్ద సామూహిక ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొన్ని మండలాలను కాకుండా మొత్తం రాష్ట్రాన్ని కరువుగా ప్రభావితంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సీఎంకు ప్రతిపక్షాలంటే చిన్నచూపు: చాడ
Published Fri, Apr 29 2016 2:02 AM
Related news
-
వాళ్లకేం పని లేదు.. CAAను వెనక్కి తీసుకోం: అమిత్ షా
ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో సీఏఏను వెనక్కి తీసుకోమని స్పష్టం చేశారాయన. ‘ప్రతిపక్షాలకు ఏ పనీ లేదు. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ను కూడా స్వార్థ రాజకీయాల కోసం చేసినట్లు వారు విమర్శిస్తుంటారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకూడదా?. ఆర్టికల్ 370 రద్దును కూడా రాజకీయ లబ్ధి కోసం చేసినట్లు ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. వాళ్ల చరిత్ర అంతా చెప్పింది చేయకపోవడమే.. కానీ మోదీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని సాకారం చేశారు’ అని అమిత్ షా తెలిపారు. ‘‘రాజ్యాంగం ప్రకారం ఏ దేశ ముస్లింలైనా భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లలో పీడనకు గురైన ముస్లిమేతర మైనారిటీల కోసం ఉద్దేశించినది. ముస్లింలు ఈ దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేయకుండా ఈ చట్టం నిషేధించదు. దీని గురించి నేను చాలా వేదికలపై మాట్లాడాను. ఏ పౌరుడి హక్కులను ఈ చట్టం తొలగించదు. అందువల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు’’ అని అమిత్ షా వెల్లడించారు. ఆశ్రయం కోరి వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించడమనేది మన సార్వభౌమ నిర్ణయమని, దానిపై రాజీపడేది లేదు. పౌరసత్వం కోసం అందరికీ తలుపులు తెరిచే ఉన్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని వాళ్లు చేస్తున్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదు. అది ఆర్టికల్ 14కు ఎలాంటి భంగం కలిగించదు. అలాగే.. NRC(జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)తో సీఏఏకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చారాయన.. చట్టం అమలు కేంద్రం అంశం.. సీఏఏను తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు చేసిన వ్యాఖ్యలను షా తప్పుబట్టారు. ‘‘ఇది కేంద్రానికి సంబంధించిన అంశం. రాష్ట్రాలది కాదు. ఎన్నికల తర్వాత అందరూ దీనికి సహకరిస్తే మంచిది. బుజ్జగింపు రాజకీయాల కోసం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దు’’ అని షా గట్టిగా చెప్పారు. సీఏఏపై ఆందోళనలు ఉద్ధృతమైతే చట్టం అమలుపై పునరాలోచనలు చేస్తారా? అన్న ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘‘తాము అధికారంలోకి వస్తే చట్టాన్ని ఉపసంహరిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ, వారు ఎన్నటికీ అధికారంలోకి రాలేరని ఇండియా కూటమికి కూడా తెలుసు. ఈ చట్టాన్ని మోదీ సర్కారు తీసుకొచ్చింది. దీన్ని రద్దు చేయడం అసాధ్యం. దీనిపై మేం దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తాం’’ అని స్పష్టం చేశారు. ‘‘ఈ చట్టంతో బీజేపీ కొత్త ఓటు బ్యాంకు సృష్టించుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వారికి ఏం పనిలేదు. వాళ్లు చెప్పింది ఎన్నడూ చేయరు. ఒవైసీ, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాంటి వాళ్లు అసత్య రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల కోసం సీఏఏను ఇప్పుడు అమలు చేయలేదు. 2019లోనే దీన్ని పార్లమెంట్లో ఆమోదించాం. కానీ కొవిడ్, ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది. సీఏఏను ఎందుకు వద్దంటున్నారో రాహుల్ గాంధీ బహిరంగంగా చెప్పాలి. మీ వ్యాఖ్యలను రుజువు చేసుకునే బాధ్యత మీదే. ఈ చట్టాన్ని ఎందుకు తెచ్చామో మేం స్పష్టంగా చెప్పాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మీరూ వివరణ ఇవ్వండి’’ అని అమిత్ షా సవాల్ చేశారు. సీఏఏపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలనూ షా దుయ్యబట్టారు. ‘‘అవినీతి బయటపడిన తర్వాత ఆయన సహనం కోల్పోయారు. వలసలపై అంత ఆందోళన ఉంటే.. బంగ్లాదేశీ చొరబాట్లు, రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడలేదు?విభజన రోజులను ఆయన మర్చిపోయినట్లున్నారు’’ అని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్లో త్వరలోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు అక్రమ చొరబాట్లను అడ్డుకుంటామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. -
ఇండియా కూటమి ఎన్నికల భేరి
పట్నా: ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు బిహార్ రాజధాని పట్నా వేదికగా ఎన్నికల ప్రచార నగారా మోగించారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలో ఆదివారం జరిగిన ‘జన్ విశ్వాస్ మహా ర్యాలీ’లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తదిపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగిస్తూ..రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గరిష్టంగా సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలను ఉసి గొల్పుతూ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. వాటిని చూసి తాము భయపడటం లేదని చెప్పారు. దేశ సంపదను, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. కేవలం ఇద్దరు, ముగ్గురు బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలను కాపాడుతున్న మోదీ ప్రభుత్వం, దేశ జనాభాలో 73 శాతం మేర ఉన్న వెనుకబడిన వర్గాలు, దళితులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్ ప్రసంగిస్తూ.. ఇటీవల తమను వదిలేసి ఎన్డీఏ పక్షంలో చేరిన సీఎం నితీశ్పై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కోసం సిద్ధం కావాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేలా మీలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు నేను ఇక్కడే ఉంటాను’అని పేర్కొన్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ..యూపీ, బిహార్లలో కలిపి 120 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడిస్తే కేంద్రంలో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. వామపక్ష పార్టీల నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా, దీపాంకర్ భట్టాచార్య కూడా ర్యాలీలో ప్రసంగించారు. రైల్వేపై రాహుల్ విమర్శలు కేంద్ర ప్రభుత్వం ధనికులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రైల్వే విధానాలను రూపొందిస్తోందని రాహుల్ ఆరోపించారు. ప్రధాని మోదీని నమ్మితే నమ్మక ద్రోహం గ్యారెంటీ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘డైనమిక్ ఫేర్ పేరుతో ఏటా 10 శాతం చొప్పున రైలు చార్జీలను ప్రభుత్వం పెంచుతోంది. క్యాన్సిలేషన్ చార్జీలను, ప్లాట్ఫాం టిక్కెట్ల ధరలను సైతం పెంచింది’’ అని విమర్శించారు. -
బీఆర్ఎస్, బీజేపీ ఓటమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రావాలన్నదే తమ ఆకాంక్ష అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్లు్యజే) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్లో చాడ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనేందుకు ఎన్నికల ముంగిట కాంగ్రెస్ అభ్యర్థులపై జరుగుతున్న ఐటీ దాడులే నిదర్శనమని ఆరోపించారు. ప్రపంచ రికార్డ్ అని చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు కుంగిపోయిన రికార్డు సాధించిందని ఎద్దేవా చేశారు. ఎన్ని కుయుక్తులు పన్నినా అధికార పార్టీకి ప్రజాతిరుగుబాటు తప్పదని జోస్యం చెప్పారు. కొత్తగూడెం స్థానంలో తమ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును ప్రజలు గెలిపిస్తారని చాడ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల నాణ్యమైన కరెంటు అమలు కావడం లేదని విమర్శించారు. ధనిక రాష్ట్రంలో పేదల ఆదాయం ఎందుకు పెరగడం లేదని, వారు ఇంకా ప్రభుత్వంపైన ఆధారపడాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్ మాట తప్పారు.. గతంలో బీజేపీకి మద్దతిచ్చిన మాట వాస్తవమేనని, ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటామంటూ సీఎం కేసీఆర్ మునుగోడు ఉపఎన్నిక ముందు తమతో చె ప్పారని చాడ గుర్తుచేశారు. కానీ ఆ తర్వాత ఆయన మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడాలని, భూమి సమస్యలు పరిష్కారానికి నోచుకోవాలని చాడ ఆకాంక్షించారు. వై.ఎస్. హయాం నాటి ఎల్లంపల్లి చెక్కుచెదరలేదు సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కట్టిన మూడేళ్లకే దెబ్బతిన్నదని చాడ విమర్శించారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి మేడిగడ్డకు సమీపంలో శ్రీకారం చుట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నేటికీ చెక్కుచెదరలేదని చాడ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తప్పని పరిస్థితుల్లోనే కాంగ్రెస్తో ముందుకు... సీట్ల విషయంలో కాంగ్రెస్, సీపీఎం మధ్య అవగాహన కుదరలేదని, కాబట్టి వామపక్షాలుగా కలసి పోటీ చేయలేకపోతున్నామని చాడ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. తామేమీ వామపక్ష ఐక్యతకు గండికొట్టలేదని.. 2018లోనూ సీపీఐ, సీపీఎం వేర్వేరుగానే ఎన్నికలకు వెళ్లాయని గుర్తుచేశారు. తమతో అవగాహనలో భాగంగా కాంగ్రెస్ ఒక్క సీటే కేటాయించడంపట్ల సంతృప్తి లేకున్నా అప్రజాస్వామిక, నియంతృత్వ బీఆర్ఎస్ను ఓడించేందుకు తప్పని పరిస్థితుల్లోనే ఆ పార్టీతో ఎన్నికల అవగాహనతో ముందుకెళ్తున్నామని చాడ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తులు అనివార్యమయ్యాయని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే ఎన్డీఏ పేరుతో 36 పార్టీలతో పొత్తు పెట్టుకుందని చాడ గుర్తుచేశారు. -
విద్యా సంస్కరణలపై వక్రభాష్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యా సంస్కరణలపై రాజకీయ విష ప్రచారం జరుగుతోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పేదింటి బిడ్డలను అంతర్జాతీయ స్థాయి విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంటే.. ఎల్లో మీడియా, విపక్షాలు విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వక్రభాష్యం పలుకుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. ఎల్లో మీడియా రాతల ఆధారంగా సెలబ్రెటీ పార్టీ (జనసేన) టోఫెల్ శిక్షణపై కాకిలెక్కలతో బహిరంగ లేఖ విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. సచివాలయంలో గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. బైజూస్, టోఫెల్పై ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు విషం చిమ్ముతున్నాయి. బహిరంగ లేఖ రాసే ముందు కొంచెమైనా వాస్తవా లు ధ్రువీకరించుకోవాలి. దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ విద్యా సంస్కరణల్లో సీఎం జగన్ విజన్ నచ్చి.. బైజూస్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఉచితంగా కంటెంట్ అందించేందుకు ముందుకొచ్చింది. బైజూస్ ఒప్పందంలో ఎక్కడా ఆర్థిక లావాదేవీలకు చోటులేదు. ఆ తర్వాత 5.18 లక్షల ట్యాబ్లలో బైజూస్ కంటెంట్ను ఇన్స్టాల్ చేసి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉచితంగా అందించాం. దీనివల్ల 35 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఒక్కో విద్యార్థికి టోఫెల్ టెస్టు ఫీజు రూ.7.50 మాత్రమే.. విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనతో పాటు ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్ ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పెంచేలా టోఫెల్ పరీక్షలను నిర్వహిస్తున్నాం. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థ ఈటీఎస్ (ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసు)తో ఒప్పందం చేసుకుని ప్రభుత్వ పాఠశాలల్లోని 3–9వ తరగతి విద్యార్థులకు టోఫెల్ ప్రైమరీ, జూనియర్ శిక్షణ ఇస్తున్నాం. ప్రైమరీలో 6.31లక్షలు, జూనియర్లో 14.39లక్షల మంది విద్యార్థులు కలిపి మొత్తం 20.70 లక్షల మందికి శిక్షణ ఇస్తున్నాం. ఒక్కో విద్యార్థికి ఆన్లైన్ టెస్టు ఫీజు కింద కేవలం రూ.7.50 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇందుకు రూ.1.50 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. ఇందులో అర్హత సాధించిన వారిలో ఆ తర్వాతి దశలో ప్రైమరీ, జూనియర్ విభాగాల్లో 40వేల మంది చొప్పున మాత్రమే ఓరల్ టెస్టు (సర్టిఫికేషన్)కు హాజరవుతారు. వీరికి టోఫెల్, ఏపీ ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేషన్ కోసం రూ.600 చెల్లిస్తాం. ఇందుకు రూ.4.80 కోట్లు వెచ్చిస్తున్నాం. ఈ లెక్కన తొలి ఏడాది రూ.6.35 కోట్లు మాత్రమే టోఫెల్ శిక్షణకు ఖర్చుచేస్తున్నాం. కానీ, ఎల్లో మీడియా, సెలబ్రెటీ పార్టీ మాత్రం ఏ లెక్కన రూ.వెయ్యికోట్లు అవుతుందని రాస్తున్నారో చెప్పాలి. 2027–28 నాటికి రూ.145కోట్లే ఖర్చు.. ఇక విద్యార్థులకు టోఫెల్లో రెండో ఏడాది నుంచి జూనియర్ స్పీకింగ్ టెస్టు ఉంటుంది. ఇందుకు రూ.2, 500 చెల్లిస్తాం. 5వేల విద్యార్థులతో స్పీకింగ్ టెస్టు మొదలుపెట్టి ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్యను పెంచుతాం. ఇంతచేసినా 2027–28 నాటి కి టోఫెల్ శిక్షణకు రూ.145 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. అలాగే, తమ ప్రభుత్వంలో నాణ్యమైన ఇంటరాక్టీవ్ ప్యాన్సల్ను రూ.1.25లక్షలకు కొనుగోలు చేయగా.. టీడీపీ హయాంలో రూ.3 లక్షల నుంచి రూ.4లక్షలు వెచ్చించినప్పుడు ఎల్లో మీడియా ఎందుకు మాట్లాడలేదు. 3,295 అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్.. ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపక పోస్టులను భర్తీచేస్తున్నాం. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో కలిపి మొత్తం 3,295 అధ్యాపక పోస్టులకు సోమవారం నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. డీఎస్సీపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి కోసమే సీఎం జగన్ విశాఖ కేంద్రంగా ఉంటూ పర్యవేక్షించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాయలసీమ అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. వచ్చే ఉగాదికి టీడీపీ, సెలబ్రిటీ పార్టీ రాష్ట్రంలో వాష్ అవుట్ అవడం ఖాయం. ఇక లోకేశ్, పురందేశ్వరి కేంద్ర మంత్రి అమిత్షాను కలిసి తమ బాధలు చెప్పుకోవడంలో తప్పేముంది. వాళ్ల కలయిక మా పార్టీకి చర్చనీయాంశం కాదు. -
కేసీఆర్ పరిపాలన తెలంగాణకు వరం: బీఆర్ఎస్ ఆస్ట్రేలియా హర్షం
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక కార్యక్రమాలు, పథకాలు చేపట్టిందని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ హర్షం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలతో తెలంగాణ సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తుందని తెలిపింది. మెల్బోర్న్లో విశ్వామిత్ర మంత్రి ప్రగడ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రగతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమం దిశగా రైతు రుణమాఫీతో పాటు హైదరాబాద్ లో మెట్రోరైలు విస్తరణ, నోటరీ ఆస్తుల క్రమబద్ధీకరణ నిర్ణయం, తదితర అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ, రైతు పక్షపాతిగా నిలిచిందని, రుణమాఫీ సంపూర్ణం చేసిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని సభ్యులు కొనియాడారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, ఉప్పు సాయిరాం, విశ్వామిత్ర,వినయ్ గౌడ్, సురేష్, ఉదయ్, జమాల్ , సాయి యాదవ్, వేణు , సతీష్ , రాకేష్, సూర్య తదితరులు పాల్గొన్నారు.
Related News by category
-
ఏమన్నా చెప్పండి.. మేనిఫెస్టోలో పెట్టేద్దాం
సాక్షి, అమరావతి: మాయ మాటలతో ప్రజలను వంచించడంలో తనకు తానే సాటైన చంద్రబాబు ఇంకా అదే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలను బుట్టలో వేసుకునేందుకు అమలుకాని అనేక హామీలను నోటికొచ్చినట్లు ఇచ్చేస్తున్న ఆయన ఇంకా అలాంటిమేమైనా ఉన్నాయా అని తెగ అన్వేషిస్తున్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించే విషయాలు ఏమైనా ఉంటే చెప్పాలని పార్టీ నాయకులు, తన మద్దతుదారులను కోరుతున్నారు. ఎవరైనా అలాంటివి చెబితే వాటిని కూడా మేనిఫెస్టోలో పెట్టేయడానికి తంటాలు పడుతున్నారు. 2014లో ఇలాగే 600కి పైగా హామీలను ఎడాపెడా ఇచ్చేసి ప్రజలను మాయచేసి ఆ తర్వాత వాటన్నింటినీ బుట్టదాఖలు చేశారు. చివరికి మేనిఫెస్టోనే మాయం చేశారు. ఈ ఎన్నికల్లోనూ సూపర్ సిక్స్ అంటూ ఇప్పటికే మళ్లీ కొత్త హామీలిచ్చేశారు. ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో వాటిని ప్రజల్లోకి వదిలారు. ముందస్తు మేనిఫెస్టో పేరుతో ఆరునెలల క్రితమే దాన్ని విడుదల చేశారు.మరోవైపు.. సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్న అమ్మఒడి, రైతుభరోసా వంటి పథకాల పేర్లు మార్చి వాటిని అమలుచేస్తానని అందులో పేర్కొన్నారు. అలాగే, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కొన్ని హామీలను కూడా కాపీకొట్టి అందులో పెట్టారు. అయితే, బాబు మాయా చరిత్రేమిటో తెలిసిన ప్రజలు దానికి కనీసం స్పందించలేదు. జనం తాను చెబితే నమ్మడంలేదని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్తో కలిసి ఉమ్మడి మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తున్నట్లు కొద్దిరోజులుగా చెబుతున్నారు. తాజాగా.. బీజేపీని కూడా కలుపుకుని మూడు పార్టీల పేరుతో మేనిఫెస్టో విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. కానీ, 2014 ఎన్నికల్లోనూ ఇదే కూటమి పేరుతో ప్రధాని మోదీ, పవన్ తన ఫొటో కలిపి, తాను సంతకం చేసి మరీ చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. అధికారంలోకి వచ్చాక దాన్ని చెత్తబుట్టలో పడేయడంతో ప్రజలు కూడా 2019లో ఆయన్ని చెత్తలోకి నెట్టేశారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి పేరుతో ప్రజలను వంచించేందుకు నానాపాట్లు పడుతున్నారు.‘సూపర్ సిక్స్’తో సంబంధంలేకుండా ఎడాపెడా హామీలు..ఈ క్రమంలోనే తన ‘సూపర్ సిక్స్’తో సంబంధం లేకుండా చంద్రబాబు మరికొన్ని హామీలను ఎన్నికల సభల్లో ఎడాపెడా ఇచ్చిపారేశారు. అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తానని, దీనికి సంబంధించిన ఫైలుపైనే తొలి సంతకం చేస్తానని ఊదరగొడుతున్నారు. యువతను ఆకర్షించే లక్ష్యంతో వారికి ఉద్యోగాల ఆశ కల్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 2014లోనూ ఇలాగే రైతు రుణాలను బేషరతుగా మాఫీచేస్తానని, తొలి సంతకం దానిపైనే చేస్తానని నమ్మబలికారు. కానీ, రుణమాఫీ చేయకుండా తూతూమంత్రంగా ఏదో చేశామంటే చేశామనిపించడంతో చంద్రబాబు మాటలు నమ్మి పంట రుణాలు కట్టని రైతులను బ్యాంకులు ముప్పతిప్పలు పెట్టాయి. వారి రుణాలు పెరిగిపోయి అష్టకష్టాలు పడ్డారు. అలాగే, బెల్టు షాపులు రద్దుచేస్తామని చెప్పి తొలి సంతకం చేసినట్లు చెప్పినా ఆ పని చేయకపోయినా ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపులను ఇంకా పెంచేశారు. ఇలా ఇచ్చిన ప్రతి హామీని బుట్టదాఖలు చేసిన బాబు మేనిఫెస్టో అమలులో సూపర్ ట్రాక్ రికార్డు ఉన్న వైఎస్సార్సీపీపై అడ్డగోలుగా విమర్శలు చేస్తుండడం గమనార్హం.వైఎస్సార్సీపీని కాపీ కొట్టేందుకే బాబు మేనిఫెస్టో ఆలస్యం..99 శాతం హామీలు అమలుచేసి మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయాలని కోరుతున్న వైఎస్ జగన్ను ఒక్క హామీ కూడా అమలుచేయకుండా మోసం చేసిన చంద్రబాబు ప్రశ్నిస్తుండడాన్ని ప్రజలు వింతగా చూస్తున్నారు. ఇప్పటికే ముందస్తు మేనిఫెస్టో విడుదల చేసి ఆ తర్వాత కూడా ఎడాపెడా హామీలిచ్చిన చంద్రబాబు తుది మేనిఫెస్టోను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఇది ఎప్పుడో విడుదల చేయాల్సి వున్నా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో కోసం ఎదురుచూశారు. తన మేనిఫెస్టోలో లేని అంశాలు అందులో ఏమైనా ఉంటే వాటిని కాపీ కొట్టే ఉద్దేశంతో ఆలస్యం చేశారు. గత ఎన్నికల్లో రూ.3 వేల పెన్షన్ హామీని అలాగే కాపీకొట్టి చివరి రెండు నెలలు ఇచ్చి ప్రజలను వంచించే ప్రయత్నం చేసినా ప్రజలు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉండడం విశేషం. తాజాగా.. వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విడుదలవడంతో తాను కూడా మేనిఫెస్టో ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఈలోపు ఇంకేమైనా ఉంటే చెప్పాలని వాటిని మేనిఫెస్టోలో పెట్టేస్తానని చెబుతుండడంపై సాధారణ జనం నవ్వుకుంటున్నారు. -
మా మేనిఫెస్టోలో ఏమీ లేకపోతే భయమెందుకు బాబూ?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమీ లేకపోతే చంద్రబాబుకు అంత భయమెందుకని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. సీఎం జగన్ను దూషించడమెందుకని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసి మేనిఫెస్టోకు ప్రాముఖ్యత తెచ్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. సీఎంను ఉద్దేశించి నిన్ను చంపేస్తే ఏమవుతుందని బాబు తాజాగా ఒక బహిరంగసభలో రంకెలేశారని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలన్నారు. ఆయన సభ్య సమాజంలో ఉండటానికి పనికిరాని వ్యక్తని ధ్వజమెత్తారు. బాబుకు అంతర్జాతీయంగా కిల్లర్ లైసెన్స్ ఇచ్చారేమోనని విరుచుకుపడ్డారు. మొన్న రాళ్లతో కొట్టండని ఆయన అనగానే విజయవాడలో సీఎం జగన్పై హత్యాయత్నం చేశారని గుర్తు చేశారు. రోజురోజుకూ దిగజారిపోతున్న ఆయనకు ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పు ఇవ్వడం ఖాయమన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల ఆదివారం మీడియాతో మాట్లాడారు. చిన్న మెదడు చితికిందా బాబూ? గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సీఎం వైఎస్ జగన్ అమలు చేయడంతో 2024 ఎన్నికల మేనిఫెస్టోపై అన్ని వర్గాల ప్రజల్లో చర్చ జరిగింది. ఇచ్చిన మాటపై నిలబడకపోతే రాజకీయాల్లోనే ఉండకూడదన్నది సీఎం వైఎస్ జగన్ సిద్ధాంతం. ప్రజల్లో విశ్వసనీయతను నిలబెట్టుకోవడానికే మేనిఫెస్టోను అత్యంత బాధ్యతాయుతంగా రూపొందించి, విడుదల చేశారు. బాబులా రోజూ ఆడిన అబద్ధమే మార్చి మార్చి చెబుతుంటే విశ్వసనీయత ఎలా వస్తుంది? వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని, అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామో చెప్పడమే మేనిఫెస్టో లక్ష్యం. అలా కాకుండా తాయిలాలతో అరచేతిలో వైకుంఠం చూపించేది మేనిఫెస్టో కాదు. వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోకి ఒక కొత్త అర్థం వచ్చింది. మేనిఫెస్టో అంటే ఇది అని ప్రజలు చెప్పుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్ను.. పాత హామీలు ఏమయ్యాయంటూ 14 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బాబు ప్రశ్నించడం విడ్డూరం. గత ఎన్నికల్లో సీఎం జగన్ 750 హామీలు ఇచ్చారని బాబు చెబుతుండటం చూస్తుంటే ఆయన చిన్న మెదడు చితికిపోయిందేమోనని అనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో 600కిపైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన 15 నిమిషాల్లోనే మేనిఫెస్టోను టీడీపీ వెబ్సైట్ నుంచి మాయం చేశారు. ఆ హామీల మాట దేవుడెరుగు.. ఇంటింటికీ ముఖ్యమైన హామీలు అంటూ లేఖలు పంపిన వాటిలోనూ ఒక్కటంటే ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేశారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి మద్యనిషేధానికి తూట్లు పొడిచిన బాబు ఇప్పుడు మద్యనిõÙధం గురించి మాట్లాడటం విడ్డూరం. మద్య నియంత్రణలో ప్రభుత్వం విజయం సాధించింది. సీపీఎస్ రద్దు చేయలేని పరిస్థితుల్లోనే ఉద్యోగుల సంక్షేమం కోసం జీపీఎస్ తెచ్చాం. మేనిఫెస్టోను చెత్తలో వేయడం చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య మేనిఫెస్టో అంటే ప్రజలకు, నాయకుడికి, పార్టీకి మధ్య బంధం లాంటిది. నేను ఇది చేస్తాను అంటే చేసి చూపిస్తారనేలా ఉండాలి. ఎన్నికలు రాగానే అరచేతిలో వైకుంఠం చూపించి.. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పి..ఎన్నికలు అయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. 2019లో సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలుపుకున్నాక ప్రజలకు కూడా మేనిఫెస్టో సీరియస్నెస్ ఏంటో తెలుస్తోంది. మేనిఫెస్టోకు అర్థం వచ్చింది. ఇదే భావనపైనే మా ధీమా, మా నమ్మకం.అప్పుడు శ్రీలంకని.. ఇప్పుడు హామీలు ఇవ్వడం మోసం కాదా? సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక కరోనాతో రెండేళ్లు ఆర్థిక కష్టాలతోపాటు అదనపు ఖర్చుల రూపంలో రూ.60 వేల కోట్ల భారం పడింది. అయినా సరే అన్ని సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేశారు. సచివాలయాలు, వలంటీర్ల ద్వారా అత్యంత పారదర్శకంగా పథకాలను అమలు చేస్తేనే ఏడాదికి రూ.70 వేల కోట్లు వ్యయమవుతోంది. ఇప్పుడు బాబు ఇస్తున్న హామీల అమలుకు ఏడాదికి రూ.1.50 లక్షల కోట్లు అవసరం. సీఎం బటన్ నొక్కుతూ రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చుతున్నారని ఆరోపించిన బాబే ఇప్పుడు ఏటా అదనంగా రూ.80 వేల కోట్లు వ్యయమయ్యే హామీలు ఇవ్వడం మోసం కాదా? ఎలాగూ అమలు చేసేది లేదు కదా అనే రోజుకో వాగ్ధానాన్ని బాబు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఎన్నికల తేదీ నాటికి ఇంకెన్ని హామీలు ఇస్తారో.. వాటి అమలుకు ఏ రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయో కూడా తెలియడం లేదు. -
నాడు వ్యతిరేకించి.. ఇప్పుడు సమర్థిస్తున్నారు
డామన్/కటక్: రిజర్వేషన్లను ఆర్ఆర్ఎస్ మొదట్నుంచీ సమర్థిస్తూ వస్తోందంటూ ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతంలోని డామన్ పట్టణంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ ఇప్పుడేమో రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదని భాగవత్ చెబుతున్నారు. మరి అప్పుడేమో తాను రిజర్వేషన్లకు పూర్తి వ్యతిరేకినని ఘంటాపథంగా చెప్పేవారు.రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్లే బీజేపీతో చేరేవారు. వాళ్లకే బీజేపీ స్వాగతం పలికి అక్కున చేర్చుకుంది. తీరా ఎన్నికల వేళ ఇప్పుడొచ్చి మళ్లీ రిజర్వేషన్లకు మా మద్దతు అంటూ భాగవత్ కొత్త రాగం ఆలపిస్తున్నారు’’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఈసారి ఎన్నికలు కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్–బీజేపీ మధ్య సైద్ధాంతిక పోరు. రాజ్యాంగ విత్తనం నుంచే దేశంలోని అనేక విభాగాలు ఉద్భవించాయి. పూర్వకాలంలో మాదిరి రాజ్యపాలన సాగించాలని మోదీజీ, ఆర్ఎస్ఎస్ ఆశ. వీటిని నాశనం చేసి ఆర్ఎస్–బీజేపీ రాజుల్లాగా దేశాన్ని పాలించాలనుకుంటున్నారు’’ అని ఆరోపించారు. ‘‘ ఆర్ఎస్ఎస్–బీజేపీ వాళ్లకు ఒకే దేశం, ఒకే భాష, ఒక్కడే నేత ఉండే వ్యవస్థ కావాలి. పశి్చమబెంగాల్ ప్రజలు బెంగాలీ మాట్లాడతారు. అలాగే గుజరాత్ వాళ్లు గుజరాతీ, తమిళులు తమిళమే మాట్లాడతారు. అలాంటపుడు ఒకే భాష, ఒకే నేత విధానంలో హేతుబద్ధత ఎక్కడుంది?’’ అని నిలదీశారు. ‘‘డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంత అడ్మిని్రస్టేటర్ పదవిలో మోదీ ప్రఫుల్ పటేల్ను ‘రాజు’లాగా నియమించారు. ప్రజాభీష్టంతో ప్రఫుల్కు పనిలేదు. ఆయన ఏమనుకున్నారో అదే చేస్తారు’’ అని ఆరోపించారు. -
బాద్షాల అరాచకాలు కన్పించ లేదా?
బెళగావి/సిర్సీ/దావణగెరె: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర∙మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మన దేశానికి చెందిన రాజులు, మహారాజులను కించపర్చిన రాహుల్ నవాబులు, నిజామ్లు, సుల్తాన్లు, బాద్షాలు సాగించిన అరాచకాలపై మాత్రం నోరుమెదపడం లేదని మండిపడ్డారు. కేవలం బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలతో లబ్ధి పొందడానికి రాహుల్ ఆరాటపడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం కర్ణాటకలోని బెళగావి, దావణగెరె, ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సీ, హోస్పేట్లో లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. మన దేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాట గాథలను కాంగ్రెస్ పార్టీ పాలనలో బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని రాశారని, ఆ పాపాన్ని రాహుల్ గాంధీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారని విమర్శించారు. భారతదేశ రాజులు, మహారాజులు పేద ప్రజలపై క్రూరమైన అణచివేత, దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఆస్తులు, భూములు బలవంతంగా లాక్కున్నారంటూ రాహుల్ ఇటీవల ఆరోపించారని గుర్తుచేశారు. ఛత్రపతి శివాజీ, కిత్తూరు రాణి చెన్నమ్మ వంటి గొప్ప పాలకులను రాహుల్ అవమానించారని చెప్పారు. దేశ చరిత్రలో నవాబులు, నిజామ్లు, సుల్తాన్లు, బాద్షాలు సాగించిన అఘాయిత్యాలు, దారుణాల గురించి మాట్లాడాలంటే కాంగ్రెస్ రాజకుమారుడి నోటికి తాళం పడుతోందని ఎద్దేవా చేశారు. మొఘల్ రాజు ఔరంగజేబు మన ఆలయాలను అపవిత్రం చేశాడని, కూలి్చవేశాడని అన్నారు. అలాంటి ఔరంగజేబును ఆరాధించే పారీ్టలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని ఆక్షేపించారు. ఔరంగజేబు దుశ్చర్యలపై రాహుల్ ఏనాడూ మాట్లాడలేదన్నారు. రాజులు, మహారాజులు మన దేశానికి ఎన్నో సేవలు చేశారని, వారి త్యాగాలు మరువలేమని పేర్కొన్నారు. రాజులకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఉన్న ధైర్యం సుల్తాన్లకు వ్యతిరేకంగా మాట్లాడడానికి రాహుల్కు లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు మైండ్సెట్ ఆ పార్టీ మేనిఫెస్టోలో కనిపిస్తోందని వెల్లడించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) మద్దతు తీసుకుంటోందని ఆరోపించారు. వయనాడ్లో నెగ్గడానికి పీఎఫ్ఐకి లొంగిపోతారా? అని రాహుల్ని ప్రశ్నించారు. ప్రజల ఓట్లతోనే నాకు ధైర్యంఓటు బ్యాంకు రాజకీయాలు మరింత నీచంగా, విధ్వంసకరంగా తయారవుతున్నాయని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ చివరి క్షణం వరకూ ఎన్నో అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. ఆలయ నిర్మాణం జరగకుండా కాంగ్రెస్, దాని కోటరీ 70 ఏళ్లపాటు కుట్రలు సాగించాయని దుయ్యబట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి రోజే అయోధ్యలో ఆలయ నిర్మాణంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, అప్పటి పాలకులు ఆ పని చేయలేదన్నారు. నిర్ణయం తీసుకొని, అమలు చేయడానికి 56 అంగుళాల ఛాతీ(మోదీ) కావాల్సి వచి్చందన్నారు. ప్రభుత్వ సొమ్ముతో గానీ, పన్ను చెల్లింపుదార్ల డబ్బుతో గానీ ఆ ఆలయం నిర్మించలేదని, శ్రీరాముడి భక్తుల విరాళాలతోనే ఆలయ నిర్మాణం జరిగిందని వివరించారు. రామమందిర ప్రాణప్రతిష్టకు హాజరు కావాలంటూ ఆహా్వనం అందజేస్తే కాంగ్రెస్తోపాటు కొన్ని పారీ్టలు తిరస్కరించాయని గుర్తుచేశారు. ఆ పార్టీలను ఎన్నికల్లో తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలకాలని, మరింత బలం చేకూర్చాలని కోరారు.వారసత్వ పన్నును ఆమోదించను కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తే వారసత్వ పన్నుతో ఆస్తులు పోగొట్టుకోవాల్సి వస్తుందంటూ ప్రజలను ప్రధానమంత్రి అప్రమత్తం చేశారు. పిల్లల కోసం ఆదా చేసుకున్న డబ్బులను సైతం లాక్కుంటారని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు 45 శాతం ఆస్తులను మాత్రమే బదిలీ చేసే అవకాశం ఉంటుందని, మిగతా 55 శాతం ఆస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, ఓటు బ్యాంక్కు కట్టబెడుతుందని పేర్కొన్నారు. అయితే, తాను జీవించి ఉన్నంతకాలం ఇలాంటి వారసత్వ పన్ను ఆమోదించే ప్రసక్తే లేదని మోదీ తేలి్చచెప్పారు. మీ ఉద్దేశాలు వదిలేసుకోండి అంటూ కాంగ్రెస్ పారీ్టకి హితవు పలికారు. కర్ణాటకలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందువులపై దాడులు పెరిగిపోయాయని ప్రధానమంత్రి అన్నారు. 2014 కంటే ముందు బ్రోకర్ల రాజ్యం కొన్ని దేశాలు, సంస్థలు మన దేశం, మన ప్రభుత్వం బలహీనపడాలని కోరుకుంటున్నాయని, అలాగైతే లాభపడొచ్చని, ఆటలు సాగించుకోవచ్చని భావిస్తున్నాయని మోదీ చెప్పారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుండడం ఆయా దేశాలకు, సంస్థలకు ఇష్టం లేదన్నారు. భారత్ బలమైన దేశంగా ఎదగడం కొందరికి కంటగింపుగా మారిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉంటే అవినీతికి పాల్పడడం, దోచుకోవడం సాధ్యం కాదని కొన్ని దుష్టశక్తులు భావిస్తున్నాయని పేర్కొన్నారు.2014 కంటే ముందు బ్రోకర్ల రాజ్యం నడిచిందని, ఢిల్లీ పవర్ కారిడార్లలో వారే అధికారం చెలాయించారని గుర్తుచేశారు. ఢిల్లీలోని హోటళ్లలో సంవత్సరాల తరబడి తిష్ట వేసి లాబీయింగ్ చేస్తూ ఉండేవారని తెలిపారు. 2014లో తాము అధికారంలోకి వచి్చన తర్వాత పవర్ కారిడార్లను శుద్ధి చేసే ప్రక్రియ చేపట్టామని వివరించారు. బ్రోకర్లకు, లాబీయిస్టులకు అక్కడ స్థానం లేకుండా చేశామని చెప్పారు. బీజేపీని అణగదొక్కడం సాధ్యం కాదన్న సంగతిని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తెలుసుకోవాలన్నారు. -
ఈసారి ఎవరు ?
సాక్షి, మేడ్చల్ జిల్లా: దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంతో పాటు మినీ భారత్గా పేరొందిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రధానంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మధ్యనే పోటీ కొనసాగుతోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పట్నం సునీత జెడ్పీ చైర్పర్సన్గా మూడు పర్యాయాలు పనిచేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరిన రాగిడి ఈసారి ఆ పార్టీ అభ్యగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముగ్గురు నేతలు కింది స్థాయి కార్యకర్తల పనితీరును సమన్వయం చేసుకుంటూ విజయమే లక్ష్యంగా ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. దీంతో ప్రతి ఎన్నికల్లోనూ మార్పును ఆహా్వనించే మల్కాజిగిరి ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది.రేవంత్కు ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ గెలుపుమల్కాజిగిరి సిట్టింగ్ స్థానం కావటంతో పాటు ఇక్కడ ఎంపీగా పని చేసిన సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. వాస్తవానికి చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన సునీతా మహేందర్రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం మల్కాజిగిరి టికెట్ కట్టబెట్టింది. మహిళ కావటం, పార్టీ అధికారంలో ఉండటం, ఇటీవల బీఆర్ఎస్ సహా ఇతర పా ర్టీ లకు చెందిన పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్లో చేరటం ఆమెకు కలిసొచ్చే అంశాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.పైగా నియోజకవర్గంలోని నేతలందర్నీ సమన్వయం చేసే బాధ్యతను స్వయంగా రేవంత్రెడ్డి తీసుకోవటంతో సునీత విజయావకాశాలు మెరుగయ్యాయని అంటున్నారు. లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయగా నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు కనుసన్నల్లో ఎన్నికల ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గెలుపు భారం అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధి లో 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థు లు గెలుపొందారు. కంట్మోనెంట్ ఎమ్మెల్యే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడ పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరుగుతోంది. దీంతో ఇక్కడ గెలుపు బీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారింది. పా ర్టీ కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాగిడి గెలుపు కోసం అంత చురుగ్గా వ్యవహరించటం లేదని పార్టీ వర్గాల్లోనే విమర్శలు విన్పిస్తున్నాయి. బీఆర్ఎస్ టికెట్ దక్కించుకోవటంలో విజయం సాధించిన రాగిడి లక్ష్మారెడ్డి పా ర్టీ లో నెలకొన్న అనిశ్చితిని తొలగిస్తేనే విజయం సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 7 అసెంబ్లీ నియోజకవర్గా ల్లో పార్టీ బలంగా ఉండటంతో బీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గం పరిధిలో పలు సమావేశాలకు హాజరవుతూ కేడర్ ప్రచారంలో పాల్గొనేలా ఉత్సాహపరుస్తున్నారు. రాగిడి కూడా భారీ ర్యాలీలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం బీజేపీ టికెట్ ఈటలను వరించటం ఓ అనూహ్య పరిణామమని చెప్పవచ్చు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతగా పేరున్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఈటల ఓటమి పాలయ్యారు. అయితే పార్లమెంటు ఎన్నికలనేవి అనేక అంశాలపై ఆధారపడి జరిగేవి కావడం, ప్రధాని మోదీ చరిష్మా, హిందూత్వ నినాదం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అండదండలు కలిసివచ్చే అంశాలుగా భావించవచ్చు. పా ర్టీ లోని క్రియాశీలకమైన నాయకుల తోడ్పాటు సానుకూల అంశంగా చెప్పవచ్చు. ఇప్పటికే ప్రధాని మోదీ ఇక్కడ రోడ్ షో నిర్వహించటం, పలువురు కేంద్ర మంత్రులు కూడా స్థానికంగా ఎన్నికల సభల్లో పాల్గొని కేడర్ను ఉత్తేజితులను చేయటం గెలుపునకు అనుకూలతగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈటల కూడా సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాల్లో విస్తృతంగా పాల్గొంటూ ఎన్నికల ప్రచారాన్ని వేడేక్కిస్తున్నారు. కార్మికుల ఓట్లూ కీలకం! ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కంట్మోనెంట్ మినహాయించి ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, మేడ్చల్, ఎల్బీనగర్ పరిధిలోని జీడిమెట్ల, బాలానగర్, శామీర్పేట్, మేడ్చల్, కుషాయిగూడ, చర్లపల్లి, మౌలాలి, నాచారం, మల్లాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో పారిశ్రామికవాడలున్నాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు ప్రైవేటులో ఇంజనీరింగ్, ఫార్మా, ఫుడ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. మౌలాలి ప్రాంతంలో ఫ్యాబ్రికేషన్, స్టీల్, ప్లాస్టిక్ ఫరి్నచర్, కెమికల్, ఎల్రక్టానిక్స్ తరహా పరిశ్రమలు ఉన్నాయి. కోకాకోలా కంపెనీల్లో కూడా కార్మికులు, ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. బాలానగర్ పారిశ్రామికవాడ పరిధిలో ఫ్యాన్లు తయారు చేసే కంపెనీలు, ఆటోమొబైల్ వస్తువుల తయారీ, బీర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్, ఫాబ్రికేషన్, వైర్ మెష్ యూనిట్లు, ఫుడ్ ప్రొడక్ట్స్, ఫార్మా యూనిట్లు తదితర కంపెనీలు ఉన్నాయి. ఐడీఏ బాలానగర్, ఐడీఏ కూకట్పల్లి, సీఐఈ గాంధీనగర్ ఒకే చోట ఉన్నాయి. శామీర్పేట్, మేడ్చల్ మండలాల్లో బయెటెక్, కెమికల్, ఇతర చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. గుండ్లపోచంపల్లిలో అపరెల్ టెక్స్టైల్ పార్కు ఉంది. తుర్కపల్లిలో ఐసీఐసీఐ నాలెడ్జి కంపెనీ పేరుతో పరిశ్రమల హబ్ ఏర్పడ్డాయి. ఘట్కేసర్, కీసరలలో కూడా చిన్న కంపెనీలు, వందలాది పరిశ్రమలు ఉన్నాయి. దీంతో ఈ పరిశ్రమల్లో పని చేసే కార్మికుల ఓట్లపై కూడా ప్రధాన పా ర్టీ ల అభ్యర్థుల గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయనే చర్చ సాగుతోంది. ఇక్కడ గెలిస్తే మంచి భవిష్యత్తు!మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పలువురు రాజకీయ నాయకులకు పునర్జన్మనిచ్చిందనటంలో అతియోశక్తి లేదు. ఇక్కడ ఎంపీగా గెలుపొందిన నేతలకు తమ పార్టీలో అత్యున్నత పదవులు దక్కడమే కాకుండా పాలనా పరంగా ముఖ్యమంత్రిగా, కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పని చేసే అవకాశం లభించింది. అదే సమయంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన నాయకులకు కూడా రాజకీయ రంగంలో మేలు జరిగిందనే అభిప్రాం కూడా ఉండటం గమనార్హం. 2009లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన సర్వే సత్యనారాయణకు కేంద్రమంత్రి వర్గంలో స్థానం దక్కింది. 2014లో టీడీపీ తరఫున గెలుపొందిన చామకూర మల్లారెడ్డి తన పదవీ కాలం పూర్తి చేసుకోక ముందే మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రేవంత్రెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తదనంతరం టీపీసీసీ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కసారి కూడా మంత్రిగా పని చేయని రేవంత్రెడ్డి ఏకంగా సీఎం కావటానికి మల్కాజిగిరి నియోజకవర్గ సెంటిమెంటే కారణమని స్థానికులు చర్చించుకుంటూ ఉంటారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందడాన్ని కూడా స్థానికులు ప్రస్తావిస్తూ ఉంటారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
సంక్షేమ సిరిమల్లిక
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement