నోట్ల రద్దుపై చర్చకు భయపడే.. | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుపై చర్చకు భయపడే..

Published Sun, Dec 18 2016 8:32 PM

నోట్ల రద్దుపై చర్చకు భయపడే..

హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాలపై చర్చించడానికి కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలు భయపడే పార్లమెంట్ సమావేశాలు జరగకుండా అడ్డుకున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, తృణాముల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పార్లమెంటులో చర్చను జరగకుండా స్తంభింపజేయడం దురదృష్టకరమన్నారు. పెద్దనోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం చర్చకు సిద్ధమేనని ప్రకటించినా ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకున్నాయో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement