పోలీసు అధికారులతో ముగిసిన దత్తాత్రేయ భేటీ | Central govt trying to kill terrorism, says Bandaru dattatreya | Sakshi
Sakshi News home page

పోలీసు అధికారులతో ముగిసిన దత్తాత్రేయ భేటీ

Jul 3 2016 7:26 PM | Updated on Aug 21 2018 7:26 PM

పోలీస్‌ ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సమావేశం ముగిసింది.

హైదరాబాద్‌:  పోలీస్‌ ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ భేటీ ముగిసింది. పోలీసు ఉన్నతాధికారులతో ఆదివారం దత్తాత్రేయ సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌ శాంతి భద్రతలపై పోలీసు అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు.

సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐసిస్‌ను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దత్తాత్రేయ వెల్లడించారు.  ఈ సమావేశానికి అడిషనల్‌ డీజీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ ఈస్ట్‌, వెస్ట్‌ కమిషనర్లు.. మహేశ్‌ భగవత్‌, నవీనచంద్‌, హైదరాబాద్‌ సీపీ మహేందర్‌ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజీవ్‌ త్రివేది తదితరులు హాజరయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement