వ్యవసాయాధికారులకూ భాగస్వామ్యం | also participation to Agricultural officers in Farmers comprehensive survey | Sakshi
Sakshi News home page

వ్యవసాయాధికారులకూ భాగస్వామ్యం

Sep 18 2017 1:37 AM | Updated on Jun 4 2019 5:16 PM

వ్యవసాయాధికారులకూ భాగస్వామ్యం - Sakshi

వ్యవసాయాధికారులకూ భాగస్వామ్యం

రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో వ్యవసాయాధికారులను భాగస్వామ్యం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌.పి.సింగ్‌ ఆదేశించారు.

- రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో ఏఈవోలకూ స్థానం  
జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం
 
సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో వ్యవసాయాధికారులను భాగస్వామ్యం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌.పి.సింగ్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన శాఖల కమిషనర్లకు లేఖ రాశారు. భూ రికార్డుల ప్రక్షాళన ప్రధాన ఉద్దేశం రైతు పెట్టుబడి పథకాన్ని సమగ్రంగా అమలు చేయడమని, దీనిపై రైతు సమగ్ర సర్వేలో పాల్గొన్న వ్యవ సాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను భాగ స్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. భూ రికార్డుల ప్రక్షాళనలో వ్యవసాయశాఖ అధికారులను భాగస్వామ్యం చేయకపోవడంపై ఇటీ వల వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే సీఎస్‌ ఈ ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. సమగ్ర సర్వేలో వ్యవసాయ భూముల వివరాలను ఇప్పటికే 90 శాతం వరకు సేకరించినందున ఏఈవోల సహకారం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. 1బీ రికార్డులు, రైతు సమగ్ర సర్వే సమాచారాన్ని కలిపి సరిచూసుకొని డిసెంబర్‌ నాటికి తుది భూరికార్డులను తయారు చేయాల్సి ఉందన్నారు. ఆ సమా చారం ఆధారంగానే రైతుల వ్యవసాయ భూముల వివరాలు తయారుచేసి వచ్చే ఖరీఫ్‌ నాటికి ఎకరానికి రూ.4 వేలు పెట్టుబడి ఇచ్చే పథకాన్ని ప్రారంభించాల్సి ఉందన్నారు. సీఎస్‌ ఆదేశాల నేపథ్యంలో ఏఈవోలంతా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో పాలు పంచుకోవాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి ఆదివారం ఆదేశించారు. సమగ్ర సర్వేలో రైతుకు సంబంధించిన సమగ్ర సమా చారం ఇప్పటికే సేకరించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement