రెవెన్యూ అధికారుల ఇళ్లపై దాడులు ముమ్మరం | acb rides on revenue officers home in hyderabad | Sakshi
Sakshi News home page

రెవెన్యూ అధికారుల ఇళ్లపై దాడులు ముమ్మరం

Jun 1 2017 4:08 PM | Updated on Sep 4 2018 5:07 PM

రెవెన్యూ అధికారుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు ముమ్మరం చేశారు.

హైదరాబాద్‌: రెవెన్యూ అధికారుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. ఇప్పటికే ముగ్గురు సబ్ రిజిస్ట్రార్స్ పై వేటు పడిన సంగతి తెల్సిందే. హెచ్‌ఎండీఏ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ టీఎన్‌జీఓ ప్రెసిడెంట్ సయ్యద్ ముజిబుల్లా ఇంటిపై దాడులు చేశారు. అడ్డగోలుగా రిజిస్ట్రేషన్స్‌ చేసినట్టు గుర్తించారు. ముజిబుల్లా ప్రస్తుతం వల్లభ్‌ నగర్‌లో ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. సోదాల్లో పలు కీలకమైన  ప్రాపర్టీ డాక్యుమెంట్స్ , బ్యాంక్‌ ఖాతా పుస్తకాలతో పాటు కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement