ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ | ACB net in transco AE | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ

Aug 10 2016 9:17 AM | Updated on Aug 17 2018 12:56 PM

రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట విద్యుత్ శాఖ ఏఈ నంగు వేణుగోపాల్‌రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుధవారం చిక్కాడు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట విద్యుత్ శాఖ ఏఈ నంగు వేణుగోపాల్‌రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుధవారం చిక్కాడు. మోమిన్‌పేట మండలానికి చెందిన ఓ రైతు పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పని పూర్తి చేయటానికి రూ.25 వేలు లంచం ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు.

దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అధికారుల సూచనల మేరకు రైతు నగదును ఏఈకి తార్నాకలో అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఏఈని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement