♦ ఇరు రాష్ట్రాలకు నీటి విడుదలపై కృష్ణా బోర్డు నిర్ణయం
♦ తెలంగాణకు సాగర్ ఎడమ కాల్వ కింద 15 టీఎంసీలు
♦ హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు 2.5 టీఎంసీలు
♦ ఏపీ వాటాగా హంద్రీ-నీవాకు 5, చెన్నై తాగునీటికి 3, తెలుగుగంగకు 5 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్లో అందుబాటులో ఉన్న జలాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఏపీకి కేటాయించింది. అక్టోబర్ అవసరాలకుగాను తెలంగాణకు 17.5 టీఎంసీలు, ఏపీకి 18.5 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఖరీఫ్కు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద 30.2 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 6 టీఎంసీలు, నల్లగొండ తాగునీటికి 4.1 టీఎంసీలు కలిపి మొత్తంగా 40.3 టీఎంసీలు కావాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఆగస్టులో కృష్ణా బోర్డును కోరింది. ఇందులో 15 టీఎంసీల నీటి విడుదలకు బోర్డు గతంలోనే అనుమతులిచ్చింది.
తర్వాత సాగర్ ఎడమ కాల్వ కింద జోన్-1, జోన్-2లోని ఖరీఫ్ సాగు అవసరాలకు 15 టీఎంసీలు కేటాయించాలంటూ తెలంగాణ మరో లేఖ రాసింది. ఇక ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు కింద 11 టీఎంసీలు, హంద్రీనీవా కింద 5, సాగర్ ఎడమ కాల్వ కింద 2.5 టీఎంసీలు కావాలని విన్నవించింది. వీటిని పరిశీలించిన బోర్డు తాజాగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఇరురాష్ట్రాలు ఎంత మేర నీటిని వినియోగించాయో వివరిస్తూ ప్రస్తుత కేటాయింపులు చేయడం గమనార్హం.
మూడు చోట్ల వాటాకు మించి..
కృష్ణా బేసిన్లో ఇప్పటివరకు తెలంగాణ ఏఎంఆర్పీ కింద 10.21 టీఎంసీలు, ఎడమ కాల్వ కింద 5.13, కల్వకుర్తి కింద 1.745 టీఎంసీలు కలిపి మొత్తంగా 17 టీఎంసీలను వినియోగించుకున్నట్లు బోర్డు తన లేఖలో పేర్కొంది. ఏపీ పోతిరెడ్డిపాడు కింద 23.79 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ కింద 9.98, కృష్ణా డెల్టా కింద 20.41, హంద్రీనీవా కింద 9.33 టీఎంసీలు కలిపి మొత్తంగా 63.524 టీఎంసీలు వినియోగించుకుందని వివరించింది. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ఏఎంఆర్పీ కింద వాటాకు మించి వినియోగం చేశారని లేఖలో తెలిపింది.
అధికంగా వినియోగిస్తే ఈ నీటిని వాడొద్దు
తాజాగా కృష్ణా బోర్డు తెలంగాణకు సాగర్ ఎడమ కాల్వ కింద 15 టీఎంసీలు, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు 2.5 టీఎంసీలు కలిపి 17.5 టీఎంసీల వినియోగానికి అంగీకరించింది. హంద్రీనీవాకు 5 టీఎంసీలు, చెన్నై తాగునీటికి 3, ఎస్ఆర్బీసీకి 3, తెలుగుగంగ ప్రాజెక్టు 5, సాగర్ ఎడమ కాల్వ కింద 2.5 టీఎంసీలు కలిపి మొత్తంగా ఏపీకి 18.5 టీఎంసీల విడుదలకు అంగీకారం తెలిపింది.
ఇవి గత ఆగస్టులో నీటి కేటాయింపులకు అదనమని, అప్పటి ఆదేశాల్లో పేర్కొన్న దాని కంటే ఎక్కువగా వాడుకొని ఉంటే ప్రస్తుత నీటిని వాడటానికి అవకాశం ఉండదని స్పష్టంచేసింది. ఒకవేళ తక్కువగా వినియోగించి ఉంటే మిగిలిన నీటిని వినియోగించుకోవచ్చని వివరించింది. ఏ రాష్ట్రమైనా అధికంగా నీటిని వాడుకొని ఉంటే ఆ రాష్ట్రం త్రిసభ్య కమిటీకి ఆ విషయాన్ని తెలియజేయాలని సూచించింది.
తెలంగాణకు 17.5.. ఏపీకి 18.5 టీఎంసీలు
Published Thu, Oct 6 2016 3:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement