విశాఖలో ప్రైవేటు బస్సు బీభత్సం | The private bus havoc in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో ప్రైవేటు బస్సు బీభత్సం

Dec 27 2015 10:38 AM | Updated on Apr 3 2019 7:53 PM

విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం ప్రాంతంలో బ్రేకులు ఫెయిలై ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది.

విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం ప్రాంతంలో బ్రేకులు ఫెయిలై ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం నర్సింహనగర్ నుంచి హైవేకు వెళుతున్న ఆదిత్య టూర్స్ ట్రావెల్స్ మినీ బస్సు ఎదురుగా వచ్చిన బైక్‌లు, కార్లను ఢీకొట్టింది. అదే క్రమంలో నడచి వెళుతున్న వారిపైకి కూడా దూసుకుపోయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారయ్యాడు. రవాణాశాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement