ప్రగతినగర్‌లో పేలుడు పదార్ధాలు స్వాధీనం


హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని ప్రగతి నగర్లో  ఎస్‌ఓటీ పోలీసులు గురువారం పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు . ఓ ఇంటి సెల్లార్‌ నిర్మించేందుకు అడ్డుగా ఉన్న బండరాళ్లను పగలగొట్టేందుకు పేలుడు వదార్ధాలు తీసుకుని వచ్చారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు సంఘటనా స్ధలానికి చేరుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.  వారి నుంచి 70 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు,  ఒక ఇటాచి వాహనం, రెండు కంప్రెషర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



 




 

Read also in:
Back to Top