వర్షంలోనే పుణ్యస్నానాలు


రాజమండ్రి: గోదావరి పుష్కరాల్లో తొమ్మిదవ రోజు బుధవారం భక్తుల తాకిడి కొనసాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, నరసాపురం, పట్టిసీమ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. భక్తులు వర్షంలోనే గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రాజమండ్రిలోని కోటిలింగాల పుష్కర ఘాట్ భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారు జాము నుంచే పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు చేస్తున్నారు. విశాఖ జిల్లాలోనే ఉదయం భారీ వర్షం కురుస్తోంది.

 




 

Read also in:
Back to Top