రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి | engineering student died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

Dec 9 2015 3:32 PM | Updated on Nov 9 2018 4:36 PM

నగరంలోని మీర్‌పేట్‌లో బుధవారం మధ్యాహ్నాం రోడ్డు ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌: నగరంలోని మీర్‌పేట్‌లో బుధవారం మధ్యాహ్నాం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందాడు. మీర్ పేట్ లో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. దీంతో ఓ బైక్ పై వెళ్తున్నగురునానక్ కాలేజీకి చెందిన సూర్య(20) అనే ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement