తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | devotees rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Oct 16 2015 8:52 AM | Updated on Sep 3 2017 11:04 AM

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏడు కొండలవాడి దర్శనం కోసం 13 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 75,374 మంది భక్తులు దర్శించుకున్నారు.

కాగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు సింహవాహన సేవ జరగనుంది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి ఊంజల్ సేవ నిర్వహిస్తారు. అనంతరం ముత్యపు పందిరి వాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement