అయ్యప్ప భక్తుల కారు బోల్తా: ఒకరి మృతి


కొత్తకోట:  కర్నూలు జిల్లా డోన్‌ మండలం కొత్తకోట శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న కారు బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి శబరిమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసకుంది. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 



 

Read also in:
Back to Top