బస్సు ప్రమాదాలలో డ్రైవర్ల అప్రమత్తతే కీలకం | Sakshi
Sakshi News home page

బస్సు ప్రమాదాలలో డ్రైవర్ల అప్రమత్తతే కీలకం

Published Wed, Oct 30 2013 3:47 PM

బస్సు ప్రమాదాలలో డ్రైవర్ల అప్రమత్తతే కీలకం - Sakshi

బస్సు ప్రమాదాలు.. ముఖ్యంగా బస్సులు తగలబడిపోవడం లాంటి సంఘటనలు జరిగినప్పుడు డ్రైవర్లు ఏమాత్రం కొంత అప్రమత్తంగా ఉన్నా భారీ ప్రాణనష్టాలు తప్పుతాయి. అదే, వాళ్లు అజాగ్రత్తగా ఉంటే మాత్రం బుధవారం నాటి కొత్తకోట తరహా ఘోరాలు తప్పవు. గతానుభవాలను బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

గతంలో.. ఇదే సంవత్సరం ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్ సమీపంలో గల అంబర్ పేట వద్ద ఎస్వీఆర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు కూడా ఒకటి తగలబడిపోయింది. కాకినాడ నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఆ బస్సు పెద్ద అంబర్ పేట ప్రాంతం చేరుకునేసరికి ఏసీలో గ్యాస్ లీకవ్వడం వల్లే మంటలు చెలరేగాయని అప్పట్లో చెప్పారు.

Advertisement
Advertisement