విండోస్ ఎక్స్‌పీ కథ కంచికి! | Windows XP might story! | Sakshi
Sakshi News home page

విండోస్ ఎక్స్‌పీ కథ కంచికి!

Apr 2 2014 11:20 PM | Updated on Sep 2 2017 5:29 AM

విండోస్ ఎక్స్‌పీ కథ కంచికి!

విండోస్ ఎక్స్‌పీ కథ కంచికి!

మీరు మీ పీసీలో విండోస్ ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారా? వచ్చే వారం.. కచ్చితంగా చెప్పాలంటే ఏప్రిల్ 8వ తేదీ తరువాత మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

మీరు మీ పీసీలో విండోస్ ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారా?  వచ్చే వారం.. కచ్చితంగా చెప్పాలంటే ఏప్రిల్ 8వ తేదీ తరువాత మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటారా? మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఇస్తున్న సపోర్ట్‌ను ఆ రోజు నుంచి నిలిపివేస్తోంది కాబట్టి. అయితే నాకేంటి? అనుకుంటూంటే...
 
ప్రపంచంలోని మొత్తం కంప్యూటర్లలో మూడొంతులు విండోస్ ఎక్స్‌పీని వాడుతున్నాయి. హ్యాకర్లు దీనిపై దాడులకు తెగబడకుండా ఉండేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు లోటుపాట్లను గుర్తించి సెక్యూరిటీ ప్యాచ్‌లను పంపిస్తూంటుంది. వచ్చే వారం నుంచి ఈ ప్యాచ్‌లు రావన్నమాట. విండోస్ ఎక్స్‌పీతోపాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2003కి సంబంధించిన అప్‌డేట్స్ కూడా అందవు.  

దీంతో ఏ క్షణంలోనైనా హ్యాకర్లు ఎక్స్‌పీపై దాడులు చేయవచ్చునన్నమాట. వీటి వల్ల వ్యక్తిగతంగా పెద్దగా నష్టం ఉండకపోవచ్చుగానీ... దేశంలోని దాదాపు లక్ష ఏటీఎంల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీటిల్లో ఎక్కువశాతం ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌నే వాడుతున్నారు.

అయితే కొన్ని బ్యాంకింగ్ సంస్థలు తమదైన సపోర్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం ఎక్స్‌పీ స్థానంలో లీనక్స్ ఆధారిత ‘భారత్ ఆపరేటింగ్ సిస్టమ్ సొల్యూషన్స్’ (బాస్)ను వాడేందుకు సిద్ధమవుతోంది.  వ్యక్తిగత వినియోగదారులు వీలైతే విండోస్ 7 లేదా 8కు మారిపోవడం మేలు అన్నది నిపుణుల సూచన.
 

Advertisement
 
Advertisement
Advertisement