కనిగిరి టికెట్ నాకే ఇవ్వాలి: కొండయ్య | TDP Leader M M Kondaiah Criticism High Command | Sakshi
Sakshi News home page

కనిగిరి టికెట్ నాకే ఇవ్వాలి: కొండయ్య

Mar 19 2014 7:56 PM | Updated on Sep 2 2017 4:55 AM

టీడీపీ అగ్రనాయకత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత ఎం.ఎం.కొండయ్య నిప్పులు చెరిగారు.

కనిగిరి (ప్రకాశం జిల్లా): టీడీపీ అగ్రనాయకత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత ఎం.ఎం.కొండయ్య నిప్పులు చెరిగారు. బీసీ నినాదం ముసుగులో టీడీపీ తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఆర్థికంగా పార్టీ కోసం బీసీ నాయకులను ఉపయోగించుకొని ఆ తర్వాత నేతలను గాలి కొదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలకు ఓడిపోయే స్థానాలను కేటాయిస్తున్నారని ఆరోపించారు. రానున్నఅసెంబ్లీ ఎన్నికల్లో తనకు కనిగిరి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనకు టిక్కెట్ ఇవ్వకుంటే కనిగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కొండయ్య హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement