వైఎస్సార్ పథకాలకు జీవం పోస్తాం:షర్మిల | sharmila comments | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ పథకాలకు జీవం పోస్తాం:షర్మిల

Apr 27 2014 1:29 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్ పథకాలకు జీవం పోస్తాం:షర్మిల - Sakshi

వైఎస్సార్ పథకాలకు జీవం పోస్తాం:షర్మిల

ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలకు తిరిగి జీవం పోస్తామని వైఎస్సార్ సీపీ నేత షర్మిల స్పష్టం చేశారు.

చిత్తూరు:ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలకు తిరిగి జీవం పోస్తామని వైఎస్సార్ సీపీ నేత షర్మిల స్పష్టం చేశారు. వైఎస్సార్ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టి జగనన్న సీఎం అయిన తరువాత ఆ పథకాలను మళ్లీ బతికించుకుందామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ ఐదేళ్లలో ప్రజల కోసం పోరాటం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని ఆమె తెలిపారు. ఈరోజు జిల్లాలోని తంబళ్లపల్లి ఎన్నికల రోడ్ షోలో ప్రసంగించిన షర్మిల.. ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే సంక్షేమం కోసం జగనన్న తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నాడన్నారు. జగన్ కు ప్రజల ముఖాల్లో చిరునవ్వులే ముఖ్యమని షర్మిల తెలిపారు.


కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలపై కక్ష కట్టి రాష్ట్ర విభజనకు పాల్పడిందన్నారు. పన్నులు, చార్జీలు పెంచిన కాంగ్రెస్‌ను చంద్రబాబు ఒక్కసారి కూడా నిలదీయలేదన్నారు. అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడితే విప్ జారీ చేసి మరీ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడరన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement