పోలింగ్ నిలిపివేయాలంటూ 'పల్లె' హల్చల్ | palle raghunath reddy creates ruckus in bukkapatnam | Sakshi
Sakshi News home page

పోలింగ్ నిలిపివేయాలంటూ 'పల్లె' హల్చల్

May 7 2014 3:47 PM | Updated on Aug 14 2018 4:24 PM

పోలింగ్ నిలిపివేయాలంటూ 'పల్లె' హల్చల్ - Sakshi

పోలింగ్ నిలిపివేయాలంటూ 'పల్లె' హల్చల్

బుక్కపట్నంలోని 64వ నెంబరు పోలింగ్ బూత్‌లో టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి హల్‌చల్‌ చేశారు.

అనంతపురం జిల్లా బుక్కపట్నంలోని 64వ నెంబరు పోలింగ్ బూత్‌లో టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి హల్‌చల్‌ చేశారు. పోలింగ్ నిలిపివేయాలంటూ ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. కారణం లేకుండా పోలింగ్ నిలిపివేయడానికి కుదరదని ఎన్నికల అధికారులు ఎంత చెప్పినా పల్లె రఘునాథ రెడ్డి మాత్రం వినిపించుకోలేదు.

జరిగిన సంఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతపురం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఎన్నికలను కొనసాగించాలని ఆదేశాంచారు. ఆయన ఆదేశాల మేరకు బుక్కపట్నంలో పోలింగ్ కొనసాగుతోంది. ఓటమి ఎదురవుతుందన్న భయంతోనే రఘునాథరెడ్డి ఇలా చేశారని అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement