కాంగ్రెస్ నేతల విందు రాజకీయం..!! | Congress leaders Dinner politics | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నేతల విందు రాజకీయం..!!

Apr 30 2014 2:08 AM | Updated on Mar 18 2019 8:51 PM

కాంగ్రెస్ నేతల విందు రాజకీయం..!! - Sakshi

కాంగ్రెస్ నేతల విందు రాజకీయం..!!

కాంగ్రెస్ పార్టీ నేతలు విందు రాజకీయానికి తెరదీశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లకు విందు ఆఫర్ చేశారు.

 విజయనగరంఫోర్ట్,న్యూస్‌లైన్:  కాంగ్రెస్  పార్టీ నేతలు విందు రాజకీయానికి తెరదీశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లకు విందు ఆఫర్ చేశారు.   మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ విజయనగరం అసెంబ్లీ అభ్యర్థి యడ్లరమణమూర్తి దుప్పాడ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారసభ అనంతరం మటన్, చికెన్ బిర్యానీతో కార్యకర్తలు, స్థానికులకు విందు ఏర్పాటు చేశారు.  సుమారు 600 మంది  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ విందు కోసం రూ. 40 వేలు వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ప్రచారంలో పాల్గొన్నకార్యకర్తలకు ఒక్కొక్కరికీ మద్యం బాటిల్ ఇచ్చినట్టు భోగట్టా.
 

Advertisement
 
Advertisement
Advertisement