తిమ్మాపూర్, న్యూస్లైన్ : కేసీఆర్.. నువ్వు కాంగ్రెస్ గురించి ఒక్కటి కాదు, రెండు కాదు.. వంద తప్పుడు కూతలు కూశా వ్.. అయినా మిన్నకున్నాం.. కానీ దళితులను ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు.. ఖబడ్దార్ అంటూ మానకొండూర్ ఎ మ్మెల్యే ఆరెపల్లి మోహన్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై విరుచుకుపడ్డారు. దొరతనాన్ని ఫాంహౌజ్లో, గడీల్లో చూపించుకోగానీ దళితులపై ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిం చారు. సోమవారం ఆయన మండలంలోని రామకృష్ణకాలనీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళితులెవరూ అడగకముందే తెలంగాణ రాష్ట్రానికి దళితుడినే సీఎం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు మాటమార్చడమెందుకని ప్రశ్నించారు. ఇది దళితులను అవమానపరచడమే అన్నారు.
తెలంగాణ వస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో వి లీనం చేస్తానన్న ఆయన మాటకు కట్టుబడి ఉండకపోవడం ఆయన నైజమేమిటో తెలిసిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీ ఇంటికి వెళ్లి కృతజ్ఞత తెలిపి న ఆయన కాంగ్రెస్పై లేనిపోని మాటలు మాట్లాడడం తగదన్నారు. స్వాతంత్య్రం కోసం జైలుకెళ్లిన గాంధీ కుటుంబ సభ్యులు ఎవరూ పాలించడం లేదని, ఒక్క కేసీఆర్ కుటుం బంలో తప్ప ఉద్యమాలు నడిపించిన వారిలో కుటుంబ పాలన లేదన్నారు. దళితులపై దొరతనం చలాయిస్తే ఎదురుదాడికి దిగక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ కేసీఆర్ జాగీ ర్ అన్నట్లుగా మాట్లాడుతున్నారని, అమరుల త్యాగాలు, విద్యార్థులు, జేఏసీ నాయకులు, కుల సంఘాల ఆందోళనతో రాష్ట్రం వచ్చిందన్నారు.
కేంద్ర మంత్రిగా, ఎంపీగా ఉండి కరీంనగర్ జిల్లాకు, తెలంగాాణకు దమ్మిడిపైసా ఖర్చు చేయలేదని విమర్శించారు. మానకొండూర్ నియోజకవర్గంపై ఇతరుల పెత్తనం చూపేందుకు అభ్యర్థిని ఎందుకు పంపారని, ఇక్కడ దళితులు లేరా..అని ప్రశ్నించారు. ఇకనైనా కిలాడీ చంద్రశేఖర్రావు నాలుక దగ్గరపెట్టుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఆయన వెంట కేడీసీసీబీ డెరైక్టర్ దేవేందర్రెడ్డి, తదితర నాయకులున్నారు.
కేసీఆర్.. ఖబడ్దార్!
Published Tue, Mar 25 2014 2:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement